Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Seethakka : త్వ‌ర‌లో తెలంగాణ పోషకాహార పగడ్బందీ ప్ర‌ణాళిక‌ 

–షోష‌కాహార తెలంగాణ నిర్మాణ‌మే ప్రధాన ల‌క్ష్యం

–స‌మిష్టి కృషితోనే పౌష్టిక తెలంగాణ సుసాధ్యం

–భాగ‌స్వామ్య ప‌క్షాల రాష్ట్రస్థాయి సమావేశంలో స్ప‌ష్టం చేసిన మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క‌

Minister Seethakka : ప్రజా దీవెన, హైద‌రాబాద్: షోష‌ కాహార తెలంగాణ నిర్మాణ‌మే ల‌ క్ష్యంగా ప్ర‌జా ప్ర‌భుత్వం మిష‌న్ మో డ్ లో ప‌నిచేస్తుంద‌ని మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క స్ప‌ష్టం చేశారు. శ‌క్తివంత‌మైన‌, ఆరోగ్య‌వంత‌మైన తె లంగాణ నిర్మాణంలో అంద‌రూ పా లు పంచుకోవాల‌ని పిల‌పునిచ్చా రు. స‌మిష్టి కృషిలోనే పౌష్టిక తెలం గాణ సాధ్య ప‌డుతుంద‌ని తెలిపా రు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల మేర‌కు దేశానికే ఆద‌ర్శంగా తెలం గాణ అంగ‌న్వాడీ కేంద్రాల‌ను తీర్చి దిద్దుతామ‌ని వెల్ల‌డించారు. తెలం గాణ రైజింగ్ -2047 డాక్యుమెంట్ కు అనుగుణంగా అంగ‌న్వాడీ సేవ‌ ల‌ను మ‌రింత మెరుగుప‌రుస్తామ‌ న్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అం గన్వాడి సేవల బలోపేతం, చిన్నా రుల్లో పోషకాహార మెరుగుదల, మ హిళా స్వయం సహాయక బృందాల భాగస్వామ్యం వంటి అంశాలపై రా ష్ట్రస్థాయి సమావేశం బేగంపేటలో ని టూరిజం ప్లాజా వేదికగా సోమ‌ వారం ఘ‌నంగా జ‌రిగింది. ఈ స మావేశానికి మంత్రి సీతక్క అ ధ్య క్షత వహించారు.

 

ఈ స‌మావేశంలో పోష‌కారంపై ప‌ని చేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆ ఫ్ న్యూట్రిషన్ (NIN), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, సీఎఫ్‌టిఆర్‌ఐ (మైసూర్), ఎయి మ్స్, ఇక్రిసాట్, యూనిసెఫ్ వంటి ప్ర‌ భుత్వ రంగ సంస్థ‌లు, ప్రథం, ఆంధ్ర మహిళా సభ, హర్మన్, బాల రక్షభా రతి వంటి స్వ‌చ్చంద‌ సంస్థల ప్రతిని ధులు, పోష‌కాహారం అందించ‌డం లో లైన్ డిపార్ట్ మెంట్లుగా వ్య‌వ‌హ‌ రిస్తున్న ప‌లు సంక్షేమ శాఖ‌లు, సి విల్ స‌ప్లైస్, విద్యా శాఖ‌, టీజీ ఫు డ్స్, సెర్ప్, ఐ అండ్ పీఆర్ శాఖ‌ల ఉ న్న‌తాధికారులు పాల్గోని త‌మ వి లువైన అభిప్రాయ‌లు తెలియ చేశా రు. వారి అభిప్రాయ‌ల‌ను, అనుభ‌ వాల‌ను, ఆలోచ‌న‌ల‌ను ఆస‌క్తిగా వి న్న మంత్రి సీత‌క్క వారి సూచన లతో “తెలంగాణ పోషకాహార ప్ర‌ ణాళిక‌” రూపొందిస్తామ‌ని ప్రక టించారు.

అంగన్వాడీ లబ్ధిదారులకు రోజుకు 200 మిల్లీ లీటర్ల విజయ పాలు, కి శోర బాలికలకు పోషకాలతో కూడి న ప‌ల్లీ, తృణ ధాన్య పట్టీలు, వారా నికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ అంది స్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్ఫ‌ష్టం చేశారు.పోషకాహార తెలం గాణ నిర్మాణం దిశగా ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించినట్లు వెల్ల‌డించారు. ని పుణుల అభిప్రాయాలను, అనుభ వాల ఆదారంగా పోష‌ణ తెలంగాణ కోసం కార్యాచరణను రూపొందిం చి, అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. తెలంగాణలో అంగ‌న్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవ‌ల‌ను వివ‌ రించారు.

 

ప్ర‌జా ప్ర‌భుత్వంలో అంగ‌న్వాడీ కేం ద్రాల సేవ‌ల్లో తీసుకొచ్చిన మా ర్పు ల‌ను వివ‌రించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగ‌న్వాడీల్లో ఎన్నో పో ష‌కాలున్న కోడిగుడ్డు స‌ర‌ ఫ‌రాను ని ల‌పి వేయ‌గా తెలంగాణ లో చిన్నా రులు, గర్భిణీలు, బాలింతలు, కౌ మార బాలికలకు పోషకాహారం అం దించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్న‌ట్లు చెప్పారు. నిపు ణుల స‌ల‌హమేర‌కు అన్ని వ‌య‌సు ల వారికి పౌష్టికాహ‌రం అందించే అంశం ప‌రిశీల‌న‌లో ఉంద‌న్నారు. అన్ని రంగాల్లో ముం ద‌జలో ఉన్న తెలంగాణ‌లో పోష‌కార లోపంతో పిల్ల‌లు భాద‌ప‌డు తున్నార‌ని ఆవే ద‌న వ్య‌క్తం చేశారు. ఈ స‌మ‌స్యను అధిగ‌మించేందుకు ఇప్ప‌టికే చ‌ర్య‌ లు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు.

 

పోషకాహార లోపాన్ని అధిగమిం చేందుకు విస్తృత స్థాయిలో అవగా హన కార్యక్రమాలు నిర్వహించను న్నట్లు తెలిపారు. స్వ‌చ్చంద సంస్థ‌ లు, మ‌హిళా స్వ‌యం స‌హ‌యక బృందాల స‌హ‌కారాన్ని తీసుకుంటా మ‌న్నారు. అంగన్వాడీలపై తల్లిదం డ్రుల్లో నమ్మకాన్ని పెంచేలా సేవల నాణ్యత పెంచుతున్నామని చెప్పా రు. అమ్మ ఒడి నుంచి చిన్నారులు అంగన్వాడి బడి లో చేరేలా ప్రోత్స‌ హించాల‌ని కోరారు. అంగన్వాడీల్లో ఆహారంతో పాటు అక్షరం, ఆరోగ్యం లభిస్తుందని పేరెంట్స్ కు తెలియ జె ప్పాలని సూచించారు. ఇక నిర్మాణ సౌకర్యం లేని ప్రాంతాల్లో మొబైల్ అంగన్వాడీలను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. నాక్, జెన్ ఎన్ టీ యూ వంటి సంస్థ‌లు మోడ‌ల్స్ సి ద్దం చేస్తున్న‌ట్లు తెలిపారు. హైద‌రా బాద్ లో వ‌ల‌స కూలీల పిల్ల‌లకు పౌష్టికాహ‌రం అందించేలా మోబైల్ అంగ‌న్వాడీలు నిర్వ‌హిస్తామ‌న్నా రు.

 

వారానికి క‌నీసం రెండు సార్లు అ యా ప్రాంతాల్లో పోష‌కాహార‌న్ని అం దిస్తామని తెలిపారు. ఇక అంగ‌ న్వాడీ కేంద్రాల‌ను ద‌త్త‌త తీసుకు నేందుకు స్వచ్ఛంద సంస్థలు ఆస క్తిని తెలిపిన నేపథ్యంలో అవసర మైన ప్రోత్సాహక చర్యలు తీసుకుం టామని వెల్ల‌డించారు. ఆరోగ్యవం తమైన తెలంగాణ నిర్మాణానికి ఆ రోగ్యవంతమైన చిన్నారులే కీల‌క‌ మ‌న్నారు. అందుకే అంగన్వాడి కేం ద్రాల సేవలపై పూర్తి దృష్టి సారించా లని మంత్రి సీతక్క పిలుపునిచ్చా రు. అంగన్వాడి సిబ్బంది స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తే ఫలితాలు మెరు గ్గా వస్తాయని పేర్కొన్నారు.

 

*పోషన్ వాటికలో భాగంగా సీ డ్స్ కిట్ ఆవిష్కరణ* మంత్రి సీ తక్క ప్రత్యేకంగా పోషన్ వాటిక కా ర్యక్రమం కింద నేషనల్ సీడ్స్ కార్పొ రేషన్ ద్వారా ఆరు రకాల కూరగా యల విత్తనాలతో కూడిన సీడ్స్ కిట్‌ను మంత్రి సీత‌క్క‌ ఆవిష్కరిం చారు. మొదటి విడతలో 4,500 అంగన్వాడి కేంద్రాలకు ఈ విత్తనాల కిట్లు పంపిణీ చేయనున్నట్లు పే ర్కొన్నారు. వీటిలో పాలకూర, తో టకూర, మెంతికూర, టమాట, వం కాయ, బెండకాయ విత్తనాలు ఉ న్నాయి. అంగ‌న్వాడీ కేంద్రాల్లో వీటి ని పెంచి ల‌బ్దిదారుల‌కు వండి పెట్టే లా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

అంగ‌న్ వాడీ సేవ‌ల బ‌లోపేతం కో సం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి స‌మావేశంలో మంత్రి సీత‌క్క తో పా టు మ‌హిళా శిశు సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి అనితా రామ‌చంద్ర‌న్, డైరెక్ట‌ర్ జీ. సృజ‌న‌, తెలంగాణ ఫుడ్ ఎంపీ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, ఐ అండ్ పీ ఆర్ అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ డీ ఎస్ జ‌గ‌ న్, ఇత‌ర శాఖ‌ల ఉన్న‌తాధి కారు లు, ప‌లు స్వ‌చ్చంద సంస్థ‌ల ప్ర‌తి నిదులు పాల్గోన్నారు.