Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Former Minister Harish Rao : మాజీ మంత్రి హరీశ్ రావు అప్పీల్, గురుకులాల దుర్ఘటనలపై సుమో టో కేసుకు హైకోర్టు సీజేకు వినతి

Former Minister Harish Rao : ప్రజా దీవెన నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ ఉయ్యాలవాడ బీసీ గురు కుల పాఠశాలలో 111 మంది వి ద్యార్థులు విషాహారం తిని ఆసుప త్రి పాలైతే కనీసం చీమకుట్టినట్టైనా లేదా రేవంత్ రెడ్డి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్య మంత్రి సొంత జిల్లా మహబూబ్ న గర్ లో తానే విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇలాంటి సంఘటన జరగడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశా రు. అందాల పోటీల్లో లక్ష రూ పా యలకు ప్లేటు భోజనం, గురుకులా ల్లో మాత్రం కలుషిత ఆహారమా అ ని ప్రశ్నించారు. కేసీఆర్ ఆనవాళ్లు మార్చడం అంటే గురుకులాల పి ల్లలను పొట్టన పెట్టుకోవడమా రే వంత్ రెడ్డి అని అన్నారు. తెలం గాణ వ్యాప్తంగా గురుకులాల్లో రోజుకో రీతిలో సంఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేనందువల్ల రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ సంఘటనలను సుమోటోగా తీసుకొని విచారించా లని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి కలుషితాహారంతో అస్వస్థతకు గు రైన విద్యార్థినిలను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలు సుకున్న మాజీ మంత్రి హరీష్ రా వు విద్యార్థులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు వ్యాఖ్య లు ఆయన మాటల్లోనే…ఇంటిగ్రే టె డ్ స్కూల్ అన్నావు రెండు సంవత్స రాల్లో ఒక ఇటుక పెట్టింది లేదు. గు రుకుల విద్యార్థుల వార్త టీవీలో పే పర్లో లేని రోజు లేదు.రేవంత్ రెడ్డి ని ర్లక్ష్యం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిం ది.ఆత్మ విమర్శ చేసుకో రేవంత్ రెడ్డి. రాజకీయాలు ఉంటే ఎన్నికల ప్పుడు చూసుకుందాం.

బీఆర్ఎస్ పార్టీ మళ్లీ గురుకులాల బాట పట్టవలసి వస్తుందని హెచ్చరి స్తున్నాం.నాగర్ కర్నూల్ జిల్లా ఉ య్యా మలవాడ బీసీ గురుకుల పా ఠశాలలో కలుషిత ఆహారం తినడం వల్ల 111 మంది పిల్లలు అస్వస్థత కు గురయ్యారు. ఇలాంటి సంఘ టనలు జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ప్రభుత్వం చేతగాని తనం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.
మేము వస్తున్న విషయం తెలుసు కొని హడావుడిగా పోలీసులను పె ట్టి పిల్లలను తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించారు. ఇంకొంతమంది విద్యా ర్థులకు చేతికి క్యాండిల్ తోనే చెట్టు కింద కుర్చీలో కూర్చోబెట్టి చికిత్స అందిస్తున్నారు.

ఎందుకు దాచి పెట్టే ప్రయత్నం చేస్తు న్నారు. పిల్లలకు మంచి భోజనం పె ట్టకుండా, వారికి సరైన వైద్యం అం దించకుండా ఎందుకు హడావిడిగా తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ఎక్క డ చూసినా ఇలాంటి ఘటనలే జ రుగుతున్నాయి.ఇదే నాగర్ కర్నూ లు జిల్లాలో మొన్న పెద్దకొత్తపల్లి హా స్టల్లో విషపూరిత ఆహారం తిని ఆ సుపత్రి పాలయ్యారు.జగిత్యాల, భ ద్రాద్రి కొత్తగూడెంలలో విషాహారం తిని ఆసుపత్రిపాలయ్యారు. హు స్నాబాద్ బీసీ గురుకుల పాఠశాల లో ఎలుకలు కొరికి విద్యార్థులు ఆ సుపత్రుల పాలయ్యారు.

ప్రతిరోజు పేపర్లో, టీవీల్లో ఏదోచోట గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆసుపత్రుల పాలైన వార్తలు చూడ వలసి వస్తున్నది. 20 నెలల రేవంత్ రెడ్డి పాలనలో వందమంది గురుకు ల విద్యార్థులు చనిపోయారు. వం దమంది విద్యార్థులు చనిపోయినా మీ గుండె కరగదా రేవంత్ రెడ్డి.
గురుకుల విద్యార్థుల గురించి పట్టిం చుకోవా? బావి భారత పౌరులైన ఈ విద్యార్థుల భవిష్యత్తుపైన మీ ప్ర భుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా?
పిల్లలకు కడుపునిండా అన్నం పెట్ట డం కూడా చేతకాదా ఈ ప్రభుత్వా నికి.

రేవంత్ రెడ్డి బాలల దినోత్సవం నా డు ఎక్కడైనా ఫుడ్ పాయిజన్ అ యితే అధికారులను సస్పెండ్ చేస్తా అని ప్రగల్బాలు పలికాడు.రేవంత్ రెడ్డి నువ్వే విద్యాశాఖ మంత్రివి. నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ లో విద్యార్థులు ఆస్పత్రి పాలైతే కూడా స్పందించవా.అందాల పోటీల్లో లక్ష రూపాయలకు ప్లేట్ భోజనం పెట్టా వు. అందాల భామలను చూడడా నికి అందాల పోటీలకు ఐదుసార్లు పోయావు. మరి అనారోగ్యానికి గురైన ఈ పిల్లలను చూడడానికి ఆసుపత్రికి రావా.. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఆసుపత్రి పాలై తుం టే వాళ్ళని పరామర్శించాలని ఎం దుకు మీకు అనిపించదు రేవంత్ రెడ్డి.వారికి మంచి భోజనం పెట్టాల ని ఎందుకు నీకు అనిపించదు.

కేసీఆర్ ఆనవాళ్లు మారుస్తా అంటే ఏమిటి రేవంత్ రెడ్డి, ఆనవాళ్లు మా ర్చడం అంటే విద్యార్థులు గురుకుల నుండి టీసీలు తీసుకుని వెళ్లిపోవ డమా.ఆనవాళ్లు మార్చడం అంటే గురుకుల పిల్లలను ఆసుపత్రి పాలు చేయడమా? ఆ పిల్లలను పొట్టన పెట్టుకోవడమా?.కేసీఆర్ 284 గా ఉన్న గురుకులాలను 1,023 గురు కులాలకు పెంచిండు. 1,60,000 మంది ఉన్న గురుకులాల్లో కేసీఆర్ గారు ఆరు లక్షల మంది విద్యార్థు లు చదివే సౌకర్యాలు కల్పించారు.

రేవంత్ రెడ్డి గురుకులాలను ఆగం చేశాడు.ఇంటిగ్రేటెడ్ స్కూలు పెడ తా అని డబ్బా కొట్టిన రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల్లో ఒక ఇటుక పెట్టింది లేదు. ఒక స్కూల్ కట్టింది లేదు.ఉన్న గురుకుల విద్యార్థులకు అన్నం పెట్టకుండా ఏడిపించే పరి స్థితి ఉంది రాష్ట్రంలో.ఒక విద్యార్థిని తల్లి రూప అనే మహిళ నన్ను కలి శారు. వారు బండై గుట్ట గ్రామం కొ ల్లాపూర్ నుంచి వచ్చారు.నిన్న వారి బిడ్డ కలుషిత ఆహారం తిని ఆసుప త్రిపాలైందని తెలిసి వచ్చింది. ఆది వారం రోజు విద్యార్థులకు పెట్టవల సింది పూరి, చపాతి. కానీ ఉదయం పెట్టింది సాంబారు అన్నం. ఆ సాం బార్లో కూడా పురుగులు వచ్చాయ ని ఆ తల్లి స్వయంగా చూసి చెప్పిం ది.

గురుకులాల్లో మెనూ కూడా ఈ ప్ర భుత్వం పాటించడం లేదు. ప్రతీరో జు ఏదో ఒక జిల్లాలో ఇలాంటి ఘ టనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అన్ని జిల్లాలో రోజుకి 100 మంది విద్యార్థులు ఆసుపత్రి పాల వుతున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటన.
ఆరు లక్షల మంది విద్యార్థుల భవి ష్యత్తును నిర్లక్ష్యం చేసి వారి జీవి తాలతో రేవంత్ రెడ్డి చెలగాట మా డుతున్నాడు. పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడకండి. బీఆర్ఎస్ మీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూస్తూ ఊరు కోదు.

మళ్లీ గురుకుల బాట పట్టాల్సి వ స్తుందని హెచ్చరిస్తున్నాం. హ్యూ మన్ రైట్స్ కమిషన్ వారు సుమో టోగా తీసుకొని రాష్ట్రంలో గురుకు ల హాస్టల్స్ లో జరుగుతున్న సంఘ టనలపై విచారణ చేయాలి. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తు న్నాము. సుమోటో గా కేసు తీసు కోండి.విద్యార్థులకు నాణ్యమైన భో జనం అందేలా చర్యలు తీసుకోండి.
బీసీ హాస్టల్లో ఇంకా బెడ్ షీట్స్ రా లేదు. కాస్మోటిక్ బిల్లులు రాలేదు. కొన్ని హాస్టల్లో ఇంకా విద్యార్థులకు బట్టలు కూడా రాలేదు. ప్రభుత్వ పాఠశాలలో రేవంత్ రెడ్డి హయాం లో విద్యార్థుల సంఖ్య తగ్గింది.ఆత్మ విమర్శ తీసుకో రేవంత్ రెడ్డి రాజకీ యాలు ఉంటే ఎన్నికలప్పుడు చేసు కుందాం.

కేసీఆర్ మీద, మా మీద న కోపం ఉంటే కేసులు పెట్టు కానీ విద్యార్థు లను ఇబ్బంది పెట్టకు. నీ రాజకీ యా మీల కోసం పిల్లల భవిష్యత్తు తో ఆడుకోవద్దని రేవంత్ రెడ్డి ప్రభు త్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు.