Kaleshwaram Project : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ చేతికి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కాళేశ్వరం కమిషన్ నివేదిక
Kaleshwaram Project : ప్రజా దీవెన, హైదరాబాద్: కాళేశ్వ రం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టి స్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్ర భుత్వానికి సమర్పించిన నివేదిక ను అధికారులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అందించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రె డ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమ క్షంలో ముఖ్యమంత్రికి అందజేశా రు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శా ఖ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, సం యుక్త కార్యదర్శి శ్రీనివాస్ నివేదిక ను ముఖ్యమంత్రికి అందించారు. క మిషన్ నివేదికను అధ్యయనం చే యడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.ఈ కమిటీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ను అధ్యయనం చేసి పూర్తి సారాం శాన్ని తయారు చేస్తుంది. నీటి పా రుదల శాఖ కార్యదర్శి, న్యాయ శా ఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి స భ్యులుగా కమిటీని ఏర్పాటు చేయ గా, ఈ కమిటీ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశా న్ని ఈ నెల 4న రాష్ట్ర మంత్రిమం డలికి సమర్పించనుంది.