–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ :నిరంతర వర్షాల దృష్ట్యా భారీ వర్షాలు వస్తే, అత్యవసర సమయంలో అప్రమత్తంగా ఉంటూ సాగునీటిని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె హాలియా 17 వ మైలు రాయి వద్ద, అలాగే 42 వ మైలు రాయి దేవులపల్లి వద్ద నాగార్జున సాగర్ ఎడమకాలువ ఎస్కేప్ ఛానెల్స్ .
పరిశీలించారు.అత్యవసర పరిస్థితులలో నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని,తక్షణమే నీటిని ఎస్కేప్ ఛానెల్ ద్వారా స్ట్రీమ్ కు పంపించాలన్నారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ గోపీనాథ్, తదితరులు ఉన్నారు.