BRS, congress assembly : బిఆర్ఎస్ పోరాటంతోనే అసెంబ్లీ తీర్మానం
--కృష్ణా జలాల వివాదం తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య --కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయికార ఒప్పందం --ఏపీ నేతలకు కాంగ్రెస్ నేతలు ఏజెంట్లుగా మారారు --కాంగ్రెస్ నేతల అవివేకంతోనే కృష్ణాపై హక్కుని కోల్పోయాం --జలాల విషయంలో కేంద్రంపై కాకుండా మా పై ఎదురు దాడి చేయడం దురదృష్టకరం -- సీఎం, మంత్రులు సాగర్ ప్రాజెక్టుకు ఎందుకు వెళ్లడం లేదు --కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు ఆరంభమైంది --13వ తేదీ సభ కు నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల నుండి ప్రజలు తరలివస్తారు
బిఆర్ఎస్ పోరాటంతోనే అసెంబ్లీ తీర్మానం
–కృష్ణా జలాల వివాదం తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య
–కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయికార ఒప్పందం
–ఏపీ నేతలకు కాంగ్రెస్ నేతలు ఏజెంట్లుగా మారారు
–కాంగ్రెస్ నేతల అవివేకంతోనే కృష్ణాపై హక్కుని కోల్పోయాం
–జలాల విషయంలో కేంద్రంపై కాకుండా మా పై ఎదురు దాడి చేయడం దురదృష్టకరం
— సీఎం, మంత్రులు సాగర్ ప్రాజెక్టుకు ఎందుకు వెళ్లడం లేదు
–కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు ఆరంభమైంది
–13వ తేదీ సభ కు నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల నుండి ప్రజలు తరలివస్తారు
ప్రజా దీవెన, నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని తనం వల్లే కృష్ణా నది ప్రాజెక్టుల హక్కులను కోల్పోయామని మాజీ మంత్రి సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపిం చారు. కృష్ణా నది పై ఉన్న ప్రాజెక్టుల సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు 13వ తేదీ మంగళవారం నల్లగొండ లో బిఆర్ఎస్ తలపెట్టిన ఛలో నల్ల గొండ భారీ బహిరంగ సభ స్థలిని మాజీ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, గాధరి కిషోర్ కుమార్, జీవన్ రెడ్డి, రవీంద్ర కుమార్ , చిరుమర్తి లింగయ్య లతో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో కలసి జగదీష్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహ బూబ్ నగర్ జిల్లాల నుండి ప్రజలు భారీగా హాజరవుతారని అన్నారు .కేసీఆర్ సభ కోసం క్రిష్ణా పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు ఆత్రుత గా ఎదురు చూస్తున్నారని అన్నారు.సభకు లక్షలాదిగాతరలిరావడం కోసం స్వచ్చందంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారని అన్నారు. కాం గ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయకారి ఒప్పందం ఉందని ఆరోపించారు.
కాంగ్రెస్ సీఎం, మంత్రులు సాగర్ ప్రాజెక్టుకు ఎందు కు వెళ్లడం లేదనీ ప్రశ్నించారు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు సాగర్ ప్రాజెక్టును ఆక్రమిం చడానికి ఏపీ వస్తే మేమే తరిమామని అన్నారు. కృష్ణా జలాల వివా దం అనేది తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్యగా అభివర్ణించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాల్లు కృష్ణానదీ ప్రాజెక్టులు మా కంట్రోల్ లోనే ఉన్నాయనీ పేర్కొన్నారు.
కృష్ణా జాలల హక్కులను కేఆర్ఎంబీ కి అప్పజెప్పడాన్ని ఏపి ప్రభు త్వం ఒప్పుకున్నా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఒప్పుకోలేదని, కాంగ్రె స్ నేతలు ఏపి నేతలకు ఏజెంట్ లు గా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ద్రోహులుగా మారారని పేర్కొన్నా రు. కృష్ణ జలాల హక్కు విషయంలో కేంద్రం పై పోరాడాల్సిందిపోయి కాంగ్రెస్ నేతలు మాపైఎదురుదాడి చేయడం దురదృష్టకరంఅన్నారు.
కృష్ణా జలాల హక్కు లపై బీఆర్ఎస్ పోరాటంతోనే కేఆర్ఎంబీకి అ ప్పగించలేదని కాంగ్రెస్ తీర్మానం చేసిందని అన్నారు.కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అన్నారు. తెలంగాణ ప్రజలు మరో సారి నీటి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది అన్నారు.