Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Ila Tripathi : వేములపల్లి పిహెచ్ సి లో నల్లగొండ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ, వైద్యులు క్ర మం తప్పకుండా హాస్టళ్లు సందర్శించాలి

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, వేములపల్లి: ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు తప్ప నిసరిగా వారి పరిధిలోని అంగన్వా డీలు,ప్రాథమిక పాఠశాలలు, హాస్ట ళ్లను సందర్శించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివా రం ఆమె నల్గొండ జిల్లా వేములపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆ కస్మికంగా తనిఖీ చేశారు. పి హెచ్ సి డాక్టర్లు ఆర్ బిఎస్ కే బృందాల తో కలిసి అంగన్వాడీలు, పాఠశాల ల విద్యార్థుల ఆరోగ్య పరీక్షలకు వెళ్లిన సందర్బంగా మెరుగైన చికి త్స కోసం విద్యార్థులను పై ఆసు ప త్రులకు రెఫరల్ చేయవలసి వస్తే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులకు పం పించా లని చెప్పారు.

విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధిం చిన వివరాలన్నింటిని రిజిస్టర్ లో నిర్వహించాలని తెలిపారు. ఆర్ బి ఎస్ కే బృందాలు విద్యార్థులకు ని ర్వహించే ఆరోగ్య పరీక్షలలో భాగం గా ప్రభుత్వం ద్వారా జారీ చేసిన ప్రొఫార్మాలు, నివేదికలలో అన్ని వి షయాలు పొందుపరచాలని అన్నా రు. సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృ ష్టి సారించాలని, వైరల్ పరీక్షల్లో పా జిటివ్ వచ్చిన వారిని నిరంతరం పరీక్షిస్తూ వారికి నయమయ్యే వి ధంగా చికిత్స అందించాలని అ న్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ వేము లపల్లి కేజీబీవీని ఆకస్మికంగా సం దర్శించి విద్యార్థులతో మాట్లాడా రు. కాగా ఆదివారం నుండి పాఠ శా లలకు దసరా సెలవులు ఇచ్చినం దున విద్యార్థులను తీసు కువెళ్లేం దుకు వారి తల్లి దండ్రులు పాఠశా లకు రాగా, జిల్లా కలెక్టర్ వి ద్యా ర్థినిల తల్లిదండ్రులతో మాట్లా డా రు. భోజనం, చదువు ఎలా ఉం ద ని విద్యార్థులను అడిగితెలుసు కు న్నారు. మెనూ ప్రకారం విద్యార్థు లకు భోజనం పెట్టాలని ఎస్ ఓ కు సూచించారు.డాక్టర్ సుచరిత, కేజీ బీవీ స్పెషల్ ఆఫీసర్, తదితరులు ఉన్నారు.