Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Uttam Kumar : మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్య, ధా న్యం దిగుబడిలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించబోతోంది 

Minister Uttam Kumar : ప్రజా దీవెన, హైదరాబాద్: ధాన్యం దిగుబడిలో తెలంగాణా రాష్ట్రం యావత్ భారతదేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించబోతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శా ఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కు మార్ రెడ్డి పేర్కొన్నారు.వానాకాలం సీజన్ లో 148 లక్షల మెట్రిక్ టన్ను ల దిగుబడి ఉంటుందని ఆయన తె లిపారు. దేశ చరిత్రలోనే ఇప్పటి వ రకు ఇంతటి దిగుబడి ఏక్కడ న మోదు కాలేదన్నారు.వానాకాలం ధాన్యం కొనుగోలు పై పౌర సరఫరా ల కేంద్ర కార్యాలయం ఆయన సమీ క్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి మాట్లాడుతూ నీటిపారు దల విస్తరణతో తెలంగాణా రాష్ట్రం సాధించిన వృద్ధి ధాన్యం దిగుబడి లో ప్రస్ఫుటమౌతుందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 67.57 లక్షల ఎ కరాల లో జరిగిన వరిసాగులో 40. 75 ల క్షల ఎకరాలలో సన్నాలు, 26. 82 లక్షల ఎకరాలలో దొడ్డు వడ్ల సాగు చేశారన్నారు.ఇందులో సన్నాలు 90.46 లక్షల మెట్రిక్ టన్నులు, దొ డ్డు రకం 57.84 లక్షల మెట్రిక్ ట న్నులు మొత్తం కలిపి 148.30 ల క్ష ల ధాన్యం దిగుబడి అంచనా వేస్తు న్నట్లు ఆయన వివరించారు.

తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావం త రువాత ఇంత పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడి అరుదైన రికార్డుగా ఆయ న అభివర్ణించారు.భారతదేశ చరిత్ర లోనే ఇది సరికొత్త రికార్డు గా నమో దు అవుతుందన్నారు.ఎన్నో సవా ళ్ళను ఎదుర్కొని అరుదైన రికార్డు నెలకొల్పిన ఘనత తెలంగాణా రైతాంగానికి చెందుతుందన్నారు.

అదే సమయంలో కొనుగోళ్లలోను రాష్ట్రం యావత్ భారతదేశానికి మార్గదర్శనంగా నిలుస్తోందన్నారు.

80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రంగం సి ద్ధం చేసిందన్నారు.కనిష్ట మద్దతు ధ ర కింద కొనుగోలు మొత్తానికి 21, 112 కోట్ల రూపాయలు అబుతుం దని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఇందులో నేరుగా రైతుల కు చెల్లింపుల కింద 19,112 కోట్లు ఖర్చు కానున్నట్లు ఆయన తెలిపా రు.

 

కేంద్ర ప్రభుత్వం బియ్యం సబ్సిడీ నిమిత్తం చెల్లించాల్సిన 6,500 కో ట్లు తక్షణమే విడుదల ఆయన డి మాండ్ చేశారు.రైతులకు మద్దతు ధర చెల్లించడంలో జాప్యం కాకుం డా ఉండేందుకు దోహదపడుతుం దన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో రైతాంగం రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి చేసిన నేపద్యంలో కొనుగో లు చేసిన ధాన్యానికి చెల్లింపులలో ఆలస్యం కాకుండా చూడాలి అన్న దే ప్రభుత్వ సంకల్పమన్నారు.అదే విదంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అ ధికారంలోకి వచ్చాకా సన్నాలు పం డించిన రైతులకు అందించే 500 రూపాయల బోనస్ ను కొనసాగి స్తుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే వానాకాలం, యసంగి పంటలకు రై తులకు బోనస్ చెల్లింపులకు గాను 3,159 కోట్లు అవసరం ఉందన్నా రు.తెలంగాణా రాష్ట్రంలో పండి స్తున్న సన్నాలకు అంతర్జాతీయ స్థాయిలో అధిక డిమాండ్ పలు కు తుందన్నారు.ఇప్పటికే ఫిలిప్పిన్ దే శంతో అనేక దేశాలకు ఉత్పత్తి అ వుతుందన్నారు.రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అయిన నేపద్యంలో ప్రభుత్వం కొనుగోలు చే సిన ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు గాను గిడ్డంగుల కొరత ఉండడం ప ట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశా రు.

భారత ఆహార సంస్థ అద్వర్యంలోని గిడ్డంగులు 22.61 లక్షల మెట్రిక్ ట న్నుల సామర్ధ్యం ఉండగా ఇప్పటికే 21.72 లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యం నిలువలతో అవి నిండి పో యాయన్నారు.కేవలం 0.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ ఉం చేందుకు మాత్రమే ఖాళీగా ఉంద న్నారు.అయితే ప్రస్తుతం 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ను వి నియోగించే రాష్ట్రాలకు రవాణా చే యక పోవడంతో ఎఫ్. సి.ఐ గిడ్డం గులలో అవి పేరుకపోయాయన్నా రు.దీనితో వానాకాలం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ ఉంచేం దు కు స్థలం కొరవడిందన్నారు.కేంద్ర ప్ర భుత్వం జోక్యం చేసుకొని బాయిల్డ్ రైస్ ను వినియోగించే రాష్ట్రాలకు సత్వరమే తరలించాలని ఆయన కోరారు. ఈ మెరకు కేంద్ర ఆహార, వి నియోగదారుల శాఖామంత్రి ,ఎఫ్. సి.ఐ సి.యం.డి లకు లేఖలు రా సి న విషయాన్ని ఆయన గుర్తు చేశా రు.

స్థాక్ తరలింపుకు ఆదనపు రైళ్ల ను కేటాయించాలని,కేంద్రం ఈ వి ష యంలో జోక్యం చేసుకొని సహ క రించని పక్షంలో ధాన్యం కొనుగోలు లో ఉత్పన్నమయ్యే పరిస్థితులకు కేంద్రం బాధ్యత వహించాల్సి ఉం టుందని ఆయన హెచ్చరించారు.

ధాన్యం దిగుబడిలో తెలంగాణ సా ధించిన రికార్డును కేంద్రం గుర్తించి సహకరించాలని ఆయన కోరారు.

తెలంగాణా రాష్ట్రం వరి దిగుబడిలో సాధించిన రికార్డ్ ను ఆయన గ ణాంకాలతో సహా వివరించారు.

2019-20 లో 72 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 2025-26 నాటికి ఏకంగా 148.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి చేరింది అంటే నీటిపారుదల శాఖా సాధించిన విజ యానికి సంకేతం అని ఆయన చె ప్పారు. బలమైన సంకల్పంతో పా టు ఆధునిక పద్దతిలో కొనుగోళ్లు జరపడం తెలంగాణా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భరోశయో కారణామన్నారు.

అత్యల్ప కాలంలో వరి దిగుబడి రె ట్టింపు కావడం రాష్ట్ర వ్యవసాయ రంగంలో నూతన అధ్యాయమన్నా రు.కొనుగోళ్ల అంశంలో అధికారులు ఎఫ్. సి.ఐ తో సమన్వయం చేసుకు ని ప్రణాళికలు రూపొందించు కో వా లని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అ ధికారులను ఆదేశించారు.పౌర సర ఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ ర వీంద్ర, డైరెక్టర్ తదితర అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నా రు.