Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

World Women day Telangana : ప్రతి స్త్రీ దేవుని ప్రతిరూపం

--సృష్టిలో మరో ప్రాణికి జన్మనివ్వడం స్త్రీ చేసుకున్న పుణ్యం --నాటి కాలం లో లాగా నేడు మహిళలపై అంతటి వివక్ష లేదు -- స్త్రీ స్వయం సాధికారతతో మహిళా శక్తిని దశదిశలా చాటుతోంది  --అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

ప్రతి స్త్రీ దేవుని ప్రతిరూపం

–సృష్టిలో మరో ప్రాణికి జన్మనివ్వడం స్త్రీ చేసుకున్న పుణ్యం

–నాటి కాలం లో లాగా నేడు మహిళలపై అంతటి వివక్ష లేదు

— స్త్రీ స్వయం సాధికారతతో మహిళా శక్తిని దశదిశలా చాటుతోంది 

–అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

ప్రజా దీవెన /హైదరాబాద్: భూమి మీద మరో ప్రాణికి జన్మనివ్వడం ద్వారా సృష్టించే శక్తిని కలిగిన ప్రతి స్త్రీ దేవుడి ప్రతిరూపమని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అ న్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్క ర్ తెలంగాణ సెక్రటేరియట్ వుమెన్స్ అసోసియేషన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించు కొని గురువారం సచివాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల కు, మహిళా హక్కుల సాధన కై పోరాడుతున్న ప్రతి ఒక్కరికి మంత్రి సురేఖ శుభాకాంక్షలు తెలిపా రు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హా జరైన సచివాలయ మహిళా ఉద్యోగులనుద్దేశించి మంత్రి ప్రసంగిం చారు.

సృష్టికి మూలం మహిళ, మహిళ లేనిదే సృష్టి లేదు, ప్రకృతికి మహి ళ వరం లాంటిది,  మహిళను భూదేవితో పోలుస్తార ని గుర్తు చేశా రు. కూతురుగా, తల్లిగా, చెల్లిగా, భార్యగా ఈ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే శక్తి మహిళలకున్నదని, నాటి కాలంలో లాగా నేడు మహిళలపై అంతటి వివక్ష లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు పిల్లలకు వారి ఇష్టానుసారం గా వారి జీవితాలను తీర్చిది ద్దుకునే స్వేచ్ఛను కుటుంబం కల్పిస్తున్నదని, ఆత్మీయానురాగాలతో మెలిగి నప్పుడే పిల్లలు మనతో మన స్ఫూర్తిగా వ్యవహరిస్తారని చెప్పారు.

వారిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ ను పెంచితే జీవితంలో ఏ కష్టం ఎదురైనా ఎదుర్కొని గొప్పగా ఎదుగు తారు. దురలవాట్లకు దూరంగా పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత కుటుం బానిదే అని అన్నారు. ఈ సమా జంలో మహిళలకు సరైన గౌరవం, గుర్తింపు లభించి ఉంటే ప్రపంచ గమ నం మరోలా ఉండేదని మంత్రి సురేఖ అన్నారు.

శతాబ్దాలుగా అవ మానాలు, తిరస్కరణలు, అణచి వేతకు గురైన ప్పటికీ, మహిళ ల అన్ని రంగాల్లో తమ ఉనికిని చాటు కుంటూ, స్వ యం సాధికారత ను సాధిస్తున్న తీరు మహిళా శక్తిని చాటుతు న్నద ని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన త ర్వాత మంత్రి హోదా లో ఈ కార్యక్ర మంలో పాల్గొనటం చాలా సంతో షంగా ఉంద ని మంత్రి తెలిపారు.