Mahashivaratri minister komatireddy venkatreddy : మహేశ్వరుని ఆశీస్సులతో ఆనందంగా ఉండాలి
--వచ్చే శివరాత్రి నాటికి శివాలయాలన్ని మరింత అభివృద్ధి --నల్లగొండ శివరాత్రి ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మహేశ్వరుని ఆశీస్సులతో ఆనందంగా ఉండాలి
–వచ్చే శివరాత్రి నాటికి శివాలయాలన్ని మరింత అభివృద్ధి
–నల్లగొండ శివరాత్రి ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజా దీవెన/నల్లగొండ టౌన్: రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతో షాలతో ఉండేలా మహేశ్వరుడు దీవించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( minister ko matireddy venkatreddy) అన్నారు. మహా శివరాత్రి పర్వది నాన్ని పురస్కరించుకొని మంత్రి నల్లగొండ జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహాశివ రాత్రి (maha Shi varatri) సందర్బంగా శుక్రవారం అయన నల్గొండ పట్ట ణం లోని పానగల్ పచ్చల సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించా రు.
పూజలు నిర్వహించేందుకు వచ్చిన రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మాత్యులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి కి ఆలయ చైర్మన్, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మం త్రి ఆలయంలో అభిషేకం తో ప్రత్యేక పూ జలు చేశారు. అనంతరం అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో నే ఆధ్యాత్మిక పరంగా, ఆర్కియాలజీ పరంగా ప్రత్యేకమైన దేవాల యాలు నల్ల గొండలోని పచ్చల సోమేశ్వరాలయం, చాయా సోమేశ్వరాలయాలు విలసిల్లుతున్నాయన్నారు. ఛాయా సోమేశ్వ రాలయాన్ని దేశవ్యాప్తం గా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఆర్కేయాలజీ నిపుణులు వచ్చి పరిశీలించారన్నారు.
ఇంతటి మహత్యం కలిగిన ఈ ఆలయా లలో పూజలు జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు. వచ్చే సంవత్సరం శివరాత్రి నాటికి ఈ ఆలయాలన్ని మరింత అభివృ ద్ధి చేస్తామని, శివరాత్రి పర్వదినం రోజునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సైతం రావడం చాలా సంతోషమని తెలిపారు.
సమాజం లోని మహిళలు అన్ని రంగాలలో ముందుకు వచ్చి అభి వృద్ధి చెందాలని తమది మహిళల సంక్షేమం కోరే ప్రభుత్వమని, ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించామని మహిళలు ఉచిత బస్సులో ప్రయాణించి ఆలయాల ను సందర్శించుకోవడం చాలా సంతోషం కలిగిస్తున్నదని అన్నారు.
ఇప్పటికే మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. త్వరలో నే భద్రాద్రి రామయ్య పాదాల దగ్గర మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయబోతున్నామని, ప్రతి మహిళకు మహిళా సం ఘాల కు ఆర్థిక పరిపుష్టి కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నా రు.
ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్మన్ శ్రీ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిప ల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ఆలయ చైర్మన్ సూర మహేష్, స్థానిక కౌన్సిలర్ ఆలకుంట్ల రాజేశ్వరి మోహన్ బాబు,పలువురు కౌన్సిలర్లు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ప్రజలందరికీ మహాశివుని కరుణాకటాక్షాలు
–మహశివరాత్రి వేడుకలో నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం
ప్రజా దీవెన/ నార్కట్ పల్లి: మహాశివ రాత్రి పర్వదినం సందర్భంగా నార్కె ట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలిం గేశ్వర స్వామి వారి దేవస్థానం నందు, నార్కెట్పల్లి మండల కేంద్రం లోని రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు, కట్టంగూర్ మం డల కేంద్రంలోని శివాలయంలో స్వామి వారిని గౌరవ నకిరేకల్ ఎమ్మె ల్యే వేముల వీరేశం సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగర ణ, పూజలు అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతీ ఒక్కరి లో ఆత్మశుద్దిని, పరివర్తనను కలిగిస్తాయని అన్నారు. ప్రజలు భక్తిశ్ర ద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని కోరారు.
మహాశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలనీ ప్రార్థించారు. లయకారుని గా, అర్ధనారీశ్వరునిగా, హిందువులు కొలిచే ఆ మహా దేవుని దీవెనల తో అందరి జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాం క్షించారు.