Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Saudi Arabia: సౌదీలో కేర‌ళ వాసికి మ‌ర‌ణ‌శిక్ష‌

సౌదీ అరేబియా లో ఓ కుటుంబం వ‌ద్ద‌ సంర‌క్ష‌కుడిగా ప‌నిచేసిన కేర‌ళ వ్య‌క్తి పొర‌పాటు ఆ ఫ్యామిలీలోని ఓ బాలుడి మృతికి కార‌ణ‌మ‌య్యాడు. దాంతో అక్క‌డి న్యాయ‌స్థానం ఆ వ్య‌క్తికి మ‌ర‌ణ‌శిక్ష విధించింది.

2006లో జరిగిన ఘ‌ట‌న‌ అప్ప‌టి నుంచి సౌదీ జైల్లోనే మ‌గ్గుతున్న కేర‌ ళ వ్య‌క్తి
అత‌డిని విడిపించేందుకు రూ. 34 కోట్ల స‌మీక‌ర‌ణ‌
2018లో అబ్దుల్‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించిన సౌదీ న్యాయ‌స్థానం
ఆ త‌ర్వాత ‘బ్ల‌డ్ మ‌నీ’ చెల్లిస్తే క్ష‌మించేందుకు బాధిత కుటుంబం అంగీకారం
రూ. 34 కోట్లు పోగుచేసి పెద్దమ‌న‌ సు చాటిన కేర‌ళీయులు

ప్రజా దీవెన, కేరళ: సౌదీ అరేబియాలో ఓ కుటుంబం వ‌ద్ద‌ సంర‌క్ష‌కు డిగా ప‌నిచేసిన కేర‌ళ ( kerala) ఓ వ్యక్తి  పొరపాటున  ఆ ఫ్యామి లీ లోని ఓ బాలుడి మృతికి కార‌ణ‌మ‌య్యాడు. దాంతో అక్క‌డి న్యా య‌స్థానం ఆ వ్య‌క్తికి మ‌ర‌ణ‌శిక్ష విధించింది. అయితే, కొన్నాళ్ల‌కు ‘బ్ల‌డ్ మ‌నీ’ చెల్లిస్తే క్ష‌మించేందుకు బాధిత కుటుంబం అంగీక‌రించింది.

ఈ క్ర‌మంలోనే ఈ నెల 18వ తేదీ లోగా సుమారు రూ. 34 కోట్లు చె ల్లించిన‌ట్ల‌యితే మ‌ర‌ణ‌శిక్ష త‌ప్పేవీలుంది. దాంతో తాజాగా ఈ పెద్ద మొత్తాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కేర‌ళీయులు స‌మీక‌రించి పెద్దమ‌ న‌సుచాటుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే కేర‌ళ రాష్ట్రం కోజికోడ్‌కు చెంది న అబ్దుల్ ర‌హీం సౌదీలోని ఓ కుటుంబం వ‌ద్ద కేర్ టేక‌ర్‌గా ప‌నికి కుదిరాడు.

ఆ ఫ్యామిలీలోని ప్ర‌త్యేక అవ‌స‌రాల బాలుడికి సంర‌క్ష‌కుడిగా ఉండ‌ డం ర‌హీం ప‌ని. అయితే, 2006లో పొర‌పాటున ఆ బాలుడి మృతికి అత‌ను కార‌ణ‌మ‌య్యాడు. అప్ప‌టి నుంచి సౌదీ జైల్లోనే ఉన్నాడు. మ‌రోవైపు బాలుడి ఫ్యామిలీ క్ష‌మాభిక్ష‌కు అంగీక‌రించ‌ క‌పోవ‌డంతో 2018లో సౌదీ న్యాయ‌ స్థానం ( soudi court ) అబ్దుల్ ర‌హీంకు మ‌ర‌ణ‌శిక్ష ఖ‌రారు చేసింది.

ఈ క్ర‌మంలో కొన్నాళ్ల‌కు ‘బ్ల‌డ్ మ‌నీ’ చెల్లిస్తే క్ష‌మించేందుకు బాధిత కుటుంబం ఒప్పుకుంది. దాంతో ఈ నెల 18లోగా సుమారు రూ. 34 కోట్లు చెల్లిస్తే ఉరిశిక్ష నుంచి త‌ప్పించుకునే అవ‌కాశం ఉంది.ఈ విష‌ యం తెలుసుకున్న కేర‌ళీ యులు ఈ భారీ మొత్తాన్ని స‌మీక‌రించి ర‌హీంను విడిపించేం దుకు కొంద‌రు ఓ బృందంగా ఏర్ప‌డి నిధుల జ‌మ మొద‌లు పెట్టారు.

పార‌ద‌ర్శ‌క‌త కోసం ప్ర‌త్యేకంగా ఓ యాప్‌ను కూడా రూపొందించ‌డం జ‌రిగింది. ఈ క్ర‌మంలో 5 రోజుల క్రితం వ‌ర‌కు కూడా కొద్ది మొత్త‌మే జ‌మ అయింది. ఆ త‌ర్వాత కేర‌ళీయులు భారీగా స్పందించి భారీ మొత్తంలో విరాళాలు అందిం చ‌డంతో రూ. 34 కోట్లు స‌మ‌కూరిన‌ ట్లు తెలుస్తోంది.