Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Supreme court: న్యాయ వ్యవస్థ పై తీవ్ర ఒత్తిడి

న్యాయవ్యవస్థపై రోజురోజుకు తీవ్ర ఒత్తిడి పెరిగిపోతుందని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులపై తీవ్ర ఒత్తిడి తీసు కువస్తూ తీర్పును తమకు అనుకూ లంగా

సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌కు 21 మంది జడ్జిలు లేఖ
ఒత్తిళ్లనుంచి న్యాయవ్యవస్థ స్వతంత్రతను రక్షించాలని విజ్ఞప్తి

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: (justice) న్యాయవ్యవస్థపై రోజురోజుకు తీవ్ర ఒత్తిడి పెరిగిపోతుందని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులపై తీవ్ర ఒత్తిడి తీసు కువస్తూ తీర్పును తమకు అనుకూ లంగా మార్చుకుంటున్నాయని ఈ మేరకు సీజేఐ జస్టిస్ చంద్ర చూడ్‌కు 21 మంది జడ్జిలు లేఖ రాశారు. సమాజంలో న్యాయవ్యవస్థను భ్రష్ఠు పట్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని సుప్రీంకోర్డు, హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు అన్నారు. తప్పుడు సమాచారాల ద్వారా న్యాయవ్యవస్థను అణగ దొక్కడానికి కొన్ని వర్గాలు యత్నిస్తు న్నాయని అన్నారు.

సంకుచిత రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయవ్య వస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీ సేందుకు ప్రయ త్నిస్తున్నారని జడ్జిలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు అనైతికం అని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య విలువలకు హానికర మనీ, న్యాయవ్యవస్థ సమగ్రతను ఇవి దెబ్బతీస్తాయని తెలిపారు. కొందరికి అనుకూలంగా ఉండే న్యాయ నిర్ణయాలను ప్రశంసిం చడం, అలా లేని వాటిని తీవ్రంగా విమర్శించ డం, న్యాయ సమీక్ష సారాంశాన్ని దెబ్బతీస్తుందని అన్నా రు.

న్యాయపరమైన ఫలి తాలను, తీర్పులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు ఆయా వర్గాలు అనుసరిస్తున్న వ్యూహాలు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వాపో యారు. అనవసర ఒత్తిళ్లనుంచి న్యాయవ్యవస్థ స్వతంత్రతను రక్షించాలని సీజేఐను కోరారు.

pressure on supreme court