Lok sabha elections: బిజెపి పై వారిద్దరి కుట్రలు
పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ధ్వజమెత్తారు.
ఎన్నికల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ అంతర్గత ఆలింగనం
మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునం దన్రావు ధ్వజం
ప్రజా దీవెన, తూప్రాన్: పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament elections) బిఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ధ్వజమెత్తారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలవనీయకుండా కుయుక్తులు పన్నుతున్నాయని ఆరోపించారు. సోమవారం ఆయన మెదక్ జిల్లా తూప్రాన్లో పర్యటించిన ఈసంద ర్భంగా ఆయన మీడియా సమావే శంలో మాట్లాడారు. బీజేపీ అధికా రంలోకి వస్తే పేదరికం, నిరుద్యోగం తగ్గించేందుకు, రైతులు, మహిళల సంక్షేమం కోసం చర్యలు తీసు కుంటామని తెలిపారు. కేసీఆర్ పెద్ద కొడుకు అని నమ్మి పదేళ్ళు అధికా రం ఇస్తే ఏంచేసిండని ప్రశ్నించారు.
తూప్రాన్ లో తిరుగుతుంటే వినతి పత్రాలు ఇస్తున్నారని, కనీసం ఆడపిల్లలు చదువుకోవడానికి డిగ్రీ కళాశాల కూడా మంజూరు చేయలే దని మండిపడ్డారు. సిద్దిపేటకు అన్ని మంజూరు చేసుకున్న హరీష్ రావు పదేళ్ళు అధికారంలో ఉండి కూడా తూప్రాన్ కు ఒక్క డిగ్రీ కళా శాల మంజూరు చేయించలేదని దుయ్యాబట్టారు. ఇగ చిన్న కొడుకు రేవంత్ రెడ్డి వచ్చిండు. రూ. 4 వేల పెన్షన్ ఇస్తున్నడు ఏమైంది అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 తారీఖున రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తానని చెప్పాడని ఏమైంది నీ రుణమాఫీ రేవంత్ రెడ్డి అంటూ చవాక్కులు పేల్చారు. రేవంత్ రెడ్డి అధికారంలో కి వచ్చి 4 నెలలవుతుందని, ఆడబి డ్డలకు నెలకు రూ.2,500 లు ఇస్త న్నడు, ఇచ్చిండా అంటూ ప్రశ్నించా రు.
కాంగ్రెసోళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ అని పెట్టిర్రు అని వట్టిగా తిరిగి ఏంజేస్తరని, ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టుడు తప్ప ఇంకేమీ లేదంటూ విమర్శించారు. రాజ్ పుష్ప కంపెనీ పేరుతో రూ.100 కోట్ల కు ఏకరా చొప్పున వెయ్యి కోట్లు పెట్టి పదె కరాలు కొనుగోలు చేసిన వెంకట్రా మిరెడ్డికి అన్ని డబ్బులు ఎక్కడి వని, తాను ఎన్నికల్లోనే పోటీ చేయలేదు, డబ్బులు ఎలా పంచు తానని వెంకట్రామిరెడ్డి అంటుండు, కానీ డీసీపీ రాధాకిషన్ రావు చెప్పిం డు అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు లు పంచినమని, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి పై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదో సీఎం రేవం త్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడనా,లేక చర్యలు తీసుకోకుండా కొత్త ప్రభాకర్ రెడ్డి రాయభారం నడిపీస్తుండా అంటూ విమర్శిం చారు. రూ.14 కోట్లకు భూమి అమ్మిన అని చెప్పి కాగితం రాయించుకుని, రూ.14 కోట్లు బలవంతంగా గుంజుకుంది కవిత అని సీబీఐ దగ్గర కవిత ఒప్పుకుంది అని పేపర్లలో వచ్చిందని, ఇక్కడ శరత్ చంద్రారెడ్డి పిలుస్తలేరు, వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేస్తలేరు,కవితపై కేసు ఎందుకు కేసు నమోదు చేయట్లేదని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.తాను మళ్ళీ చెబుతున్న వెంకట్రామిరెడ్డి ఇవ్వన్నీ నేను చెప్పట్లేదు, అరెస్ట యిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తెలియజేశాడని వెల్లడించారు.
Congress and BRS conspiracy on BJP