Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Parliament elections: ఇండియా కూటమిదే అధికారం

బిజెపి పార్టీ మతపరంగా ప్రజలను విభజించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం తప్ప మరొక్కటి లేదని భారీ నీటిపారుదల, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

బిజెపికి తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత లేదు
పార్లమెంటు ఎన్నికల తర్వాత బి ఆర్ ఎస్ పార్టీ కనుమరుగు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రజా దీవెన కోదాడ: బిజెపి పార్టీ మతపరంగా ప్రజలను విభజించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం తప్ప మరొక్కటి లేదని భారీ నీటిపారుదల, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో ఎమ్మెల్యే  పద్మావతి రెడ్డి తో కలిసి 18వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు కోదాడ లో జరిగే పార్లమెంటు కోదాడ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావే శంలో పాల్గొని మాట్లాడారు. విభజ న హామీల్లో భాగంగా పార్లమెంటు లో చట్ట ప్రకారం తెలంగాణకు రావా ల్సిన (Central Tribal University ) సెంట్రల్ ట్రైబల్ యూనివర్సి టీ, కాజీపేట రైల్వే కోచ్, బయ్యారం స్టీల్ ప్లాంట్, హైదరాబాదులో రెండు న్నర లక్షల కోట్లతో 50 లక్షల ఐటి ఉద్యోగాలు వంటి హామీలు అమలు చేయకుండా మోసం చేసిన బిజెపి పార్టీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ లు చెప్పాలన్నారు.

రైతుల ఆదా యాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి వారి ఆదాయాన్ని పూర్తిగా తగ్గిం చిందని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు కెసిఆర్ రాజుల తెలంగాణను పాలిస్తే అధికారం పోయిన వంద రోజుల్లోనే పార్టీ ఖాళీ అయిందని పార్లమెంట్ ఎన్నికల తర్వాత బి ఆర్ ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందన్నారు. కాంగ్రె స్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి దేశంలోనే(Parliament elections)అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. బిజెపి, బి ఆర్ ఎస్ పార్టీ తప్పఅన్ని పార్టీల నాయకులను ఓట్లుఅడగాలని నాయకులకు సూచించారు.

ఈ సమావేశంలో పిసిసి డెలికేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల,కోదాడ పట్టణ పార్టీ అధ్యక్షులు వంగవీటి రామారావు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు, పాండురంగారావు, మాజీ సర్పంచ్ డిసిసి ఉపాధ్యక్షులు పారా సీత య్య, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వర రావు,మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, కీతా. వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి, బషీర్,పుల్లారెడ్డి కౌన్సిలర్లు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

INDIA won in parliament elections