Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nominations :సజావుగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ

లోక సభ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు నియమించిన సిబ్బంది అందరూ జాగ్రత్తగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికా రి దాసరి హరిచందన ఆదేశించారు.

జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికా రి దాసరి హరిచందన
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: లోక సభ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల (Nominations) స్వీకరణ ప్రక్రియకు నియమించిన సిబ్బంది అందరూ జాగ్రత్తగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికా రి దాసరి హరిచందన ఆదేశించారు. మంగళ వారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాల యంలోని సమావేశ మంది రంలో ఏర్పాటు చేసిన లోకసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చాంబ ర్ లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కు నియమించిన అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు.

నామినేషన్ల (Nominations) స్వీకరణ సందర్భంగా పాటించే ప్రక్రియలను ఒక్కో సిబ్బం ది తో వారు చేయవలసిన విధులపై జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నా రు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుం డా నామి నేషన్ల ప్రక్రియను పూర్తి చేయా లన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు సమర్పించే బ్యాం కు ఖాతా ,ఫోటోగ్రాఫ్, ప్రతిపాదకు లు తదితర అంశాలకు సంబంధించి సూచనలు చేశారు. నామినేషన్లకు సంబంధించి సిబ్బం దికి పూర్తి అవ గాహన కలిగి ఉండాలని , నామినేష న్ల కోసం ప్రత్యేకించి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు ఎన్నికల సంఘానికి పంపించే నివేదికలు జాగ్రత్తగా పరిశీలించి పంపించాలని ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ లోకసభ ఎన్నికల సందర్భం గా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కంట్రోల్ రూమ్, ఎన్నికల అనుమతులను ఇచ్చే సువిధ విభాగం, ఎన్నికల వ్యయ నిర్వహణకు ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ విభాగాలను తనిఖీ చేసి ఆయా టీముల పని తీరును పరిశీలించా రు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్ఓ డి.రాజ్యలక్ష్మి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Nominations started in parliament elections