Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cherlagudem Reservoir: సాగు నీటి పోరు యాత్రలో బూర

సాగు నీటి పోరు యాత్ర కార్యక్రమంలో భాగం గా చెర్లగూడెం రిజర్వాయర్ ను భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తో కలిసి సందర్శిం చారు.

చెర్లగూడెం రిజర్వాయర్ ను సందర్శించిన నర్సయ్య గౌడ్

ప్రజా దీవెన, నల్లగొండ: సాగు నీటి పోరు యాత్ర కార్యక్రమంలో భాగం గా (Cherlagudem Reservoir) చెర్లగూడెం రిజర్వాయర్ ను భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తో కలిసి సందర్శిం చారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడి వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభు త్వం కేసిఆర్ చేర్లగూడెం రిజర్వా యర్ ను కుర్చీ వేసుకొని పూర్తి చేస్తాను అని ప్రగల్బాలు పలికారు కానీ ఆ తర్వాత మొహం చాటే సారని విమర్శించారు. కెసిఆర్ సిఎం కుర్చీ పోయేంతవరకు చర్ల గూడెం ముఖం కూడా చూడ కుoడా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూ నిర్వాసితు లకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ నేటికీ ఇవ్వకుండా నిర్లక్ష్య ధోరణి అవలం బిస్తుందని విమర్శించారు.

భూ నిర్వాసితులకు న్యాయం జరగ లేదని, ఈ చర్లగూడెం రిజర్వాయర్ (Cherlagudem Reservoir)పూర్తయితే మునుగోడు నియోజక వర్గం సస్యశ్యామలం అవుతుం దని, కానీ గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం దీన్ని పట్టించుకునే పాపానపోవట్లేదని దుయ్యబట్టారు. రైతులను, భూ నిర్వాసితులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చమరవ చరమగీతం పడాల్సిన సమయం ఆసన్నమైంది అని అన్నారు.సాగు నీటి ప్రాజెక్టులు పూర్తయ్యేదెప్పుడని, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం తడారేదెప్పుడని ప్రశ్నించారు. నత్తనడక నడుస్తున్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే పార్లమెంటు సభల్లో గలమెత్తనున్న బూర నర్సయ్య గౌడ్ ను పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి రైతులను కోరారు.

Bura narsaiah goud visit Cherlagudem Reservoir