Anganwadi teachers: అంగన్వాడిలకు నష్టం చేకూర్చే సర్కులర్ ఉపసంహరిoచాలి
అంగ న్వాడీ టీచర్లు హెల్పర్లకు నష్టం కలిగించే సర్కులర్ 1334 వెంటనే ఉపసంహరించుకోవాలని, గత సంవత్సరం లో చేసిన సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: అంగ న్వాడీ టీచర్లు హెల్పర్లకు నష్టం కలిగించే సర్కులర్ 1334 వెంటనే ఉపసంహరించుకోవాలని, గత సంవత్సరం లో చేసిన సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) నలగొండ ప్రాజెక్టు కార్యదర్శి కే.సముద్రమ్మ లు డిమాండ్ చేశారు. మంగళవారం యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ బాసిద్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ గతంలో అంగన్వాడి యూనియన్ (Anganwadi Union) ఆధ్వర్యంలో 24 రోజుల పాటు సమ్మె చేసి పోరాటాల ద్వారా సాధించుకున్న టీచర్ కు రెండు లక్షలు ఆయాకు ఒక లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను యధావిధిగా అమలు చేస్తామని ప్రభుత్వాలు హామీ ఇచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం 1334 ఐసిడిఎస్ సర్కులర్ ద్వారా లక్ష రూపాయలు మాత్రమే బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి 65 సంవత్సరాలు నిండిన టీచర్లు ఆయాలను ఇంటికి పంపేందుకు సిద్ధమైందని సంవత్సరాల తరబడి ప్రజలకు సేవన అందించినటువంటి వారిని అమాంతరంగా ఇంటికి పంపడం అంటే ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే సర్కులర్ 1334 ఉపసంహరించుకొని, టీచర్ కు రెండు లక్షలు, హెల్పర్ కు లక్ష రూపాయల రిటర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు కనీస వేతనం 26 వేల రూపాయలు, పని భారం తగ్గించడం, ప్రమాద, ఆరోగ్య బీమా సౌకర్యాలతో పాటు పెన్షన్, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
కొత్త ప్రభుత్వం అంగన్వాడీల కోరికలను పరిశీలించి కొత్త ఉత్తర్వులు ఇవ్వాల్సిన ప్రభుత్వం గతంలో అంగన్వాడీ టీచర్లు ,హెల్పర్లు వ్యతిరేకించిన పాత జీవో ఉత్తర్వులనే మళ్లీ ముందుకు తెచ్చి అమలు చేయాలని చూడడం సోషనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల మనోభావాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఆర్థికంగా నష్టం కలిగించే విధమైన చర్యలు చేపడుతూ ఏకపక్షంగా, వేగవంతంగా ముందుకు పోతుందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు పరచకపోవడమే కాకుండా, గత ప్రభుత్వ హామీలను కూడా అమలు చేయకుండా అంగన్వాడీ ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం పునరాలోచన చేసి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిం చాలని, సర్కులర్ 1334 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, సలివొజు సైదాచారి,తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూని యన్ (సిఐటియు) నలగొండ ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు పాదూరి లక్ష్మీ,యల్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Circular damage Anganwadi teachers