పసిడి ధరలు ధగ ధగ
గతానికి భిన్నంగా మండుతున్న ఎండలు భగభగ మంటూ మoడుతుండగా, అదేస్థాయిలో బంగారం ధరలు విపణిలో ధగధగ మంటున్నాయి.
ఆల్ టైం అత్యున్నతస్థాయికి చేరిన బంగారం ధర
మార్కెట్ లో మర్మోగిపోతున్న బంగారం రూ. 76వేలు, వెండి రూ.845 ధరలు
గతమేన్నాడూ లేనంతగా తారా స్థాయికి చేరుకున్న వైనం
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: గతానికి భిన్నంగా మండుతున్న ఎండలు భగభగ మంటూ మoడుతుండగా, అదేస్థాయిలో బంగారం ధరలు విపణిలో ధగధగ మంటున్నాయి. విపణిలో పసిడి (gold) ధరలు పట్టా పగ్గాల్లేకుండా పరుగులు పెడు తుండడంతో పసిడి ప్రియులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటీవల కాలంలో రోజుకో రికార్డు బద్దలుకొడుతూ అట్టహాసం చేస్తు దడంతో మనసు మీదకు తీసుకు న్న గృహిణులు గుటకలేన్నారు. వరుసగా వారం రోజులుగా మును పెన్నడూలేని మరో స్థాయికి చేరుకు న్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం కనీవినీ ఎరుగని రీతిలో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ.78,000 మార్కును దాటింది. బులియన్ మార్కెట్లో తొలిసారి 10 గ్రాములు రూ.73,350 పలికింది. గతంతో పోల్చితే ఒక్కరోజే రూ.1,050 ఎగబాకడం గమనార్హం.
స్పాట్ మార్కెట్లో రూ.76వేలకు..
బంగారం మార్కెట్ లో స్థానిక పన్నులతో కలిపితే తులం పుత్తడి మంగళవారo రూ.76వేలకు చేరుకుంది. మంగళవారం కొద్దిగా తగ్గి ఒకానొక దశలో 10 గ్రాములు రూ.76000గా నమోదైనట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఫ్యూచర్ మార్కెట్లలోనూ పసిడి కాంతులు విర జిమ్ముతున్నాయి.
వెండి ధరలూ వెలిగిపోతున్నాయి… వెండి ధరలూ దౌడు తీస్తూ వేలిగిపో తున్నాయి. కిలో వెండి ధర రూ.84,500కు కాస్తంత తగ్గి మంగళవారం నాటికి చేరింది. సాధారణ కొనుగోలుదారులతో పాటు పారిశ్రామిక వర్గాల నుంచి పెరిగిన డిమాండే ధరల పెరుగుద లకు కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ధరల ధగ ధగ తో ఆందోళన…
మార్కెట్ లో బంగారం ధరలు ఇలా పెరుగుతూపోతే వ్యాపారం సాగ దని జ్యుయెల్లర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నడు స్తున్న ట్రెండ్తో అమ్మకాలు మందగించాయ ని ప్రముఖ ఆభరణాల వర్తక సంస్థ సెన్కో గోల్డ్ లిమిటెడ్ అంటున్నది. డిమాండ్ పడిపోయిందని కోల్ కత్తా చెందిన ఈ కంపెనీ పేర్కొంటున్నది. అయితే స్థానిక పండుగలతో మార్కెట్ కొంత పుంజుకోవచ్చన్న ఆశాభావం ఉన్నప్పటికీ లోక్ సభ ఎన్నికల దృష్ట్యా నగదుపై ఉన్న ఆంక్షలు తమ అమ్మకాలను ప్రభా వితం చేయవచ్చన్న అనుమానాల నూ వ్యక్తం చేశారు.
Gold rate increased in India