Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Parliament election: నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట బందోబస్తు

పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేపట్టామని జిల్లా ఎస్పి చందనా దీప్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నలుగురు వ్యక్తులు, మూడు వాహనాలకే పర్మిషన్

జిల్లా ఎస్పి చందనా దీప్తి

ప్రజా దీవెన నల్గొండ:  పార్లమెంట్ ఎన్నికల(Parliament elections) నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేపట్టామని జిల్లా ఎస్పి చందనా దీప్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు జరుగుతుందని, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు.

దానికోసం సెంట్రల్ ఫోర్స్, అర్ముడ్, సివిల్ ఫోర్స్ తో మూడు అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ పరంగా అవసరమైన అన్ని భద్రతా చర్యలు, పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం రిటర్నింగ్ కార్యాలయానికి 100 మీటర్ల లోపలకి అభ్యర్థి తో పాటు నలుగురు వ్యక్తులు, మూడు వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఉంటుందని ఈ సందర్బంగా అన్నారు.

Parliament elections nominations process