Megastar Chiranjeevi : కూటమిదే విజయం
ఎపిలో జరుగుతున్న ఎన్నికలలో జనసేన, టిడిపి, బిజెపి కూటమి అభ్యర్దులు విజయం సాధించాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు.
ఏపిలో కూటమి అభ్యార్డులం దరూ విజయం సాధించాలి
జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి గా ఏర్పడడం శుభ పరిణామం
రాజకీయాలపై పెదవి విప్పిన మెగాస్టార్ చిరంజీవి
ప్రజా దీవెన, హైదరాబాద్: ఎపిలో జరుగుతున్న ఎన్నికలలో జనసేన, టిడిపి, బిజెపి కూటమి అభ్యర్దులు విజయం సాధించాలని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)ఆకాంక్షించారు. కొన్నేళ్లు గా రాజకీయాలకు దూరం గా ఉం టున్న చిరంజీవి తొలిసారిగా పెదవి విప్పి తన మనసులోని మా టను వెల్లడించారు.జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడడం మంచి పరిణామమని అభిప్రాయ పడ్డారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్ వల్లే చాలా కాలం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడు తున్నానని అన్నారు. అనకాపల్లి లోక్సభ ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్ హైదరాబాద్లోని చిరంజీవి నివాసంలో నేడు ఆయన ను కలిశారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్లను గెలిపిం చాలని ఓటర్లను చిరంజీవి కోరారు. తమ్ముడు పవన్ కల్యాణ్(Pawan kalyan) కారణం గా చాలా కాలం తర్వాత రాజకీయ ల గురించి మాట్లాడుతున్నానని, పవన్ కల్యాణ్, చంద్రబాబు, బీజేపీ నాయకత్వం అందరూ మంచి కూట మిగా ఏర్పడ్డారని ఇది శుభపరిణా మమని(Good luck to you) వ్యాఖ్యానించారు. సంతో షంగా ఉందని, నా చిరకాల మిత్రు డు సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్ నాకు కావాల్సిన ఇద్దరూ అనకాపల్లి లోక్సభ పరిధిలోనే పోటీ చేస్తున్నా రని, ఒకరు ఎంపీ అభ్యర్థిగా, ఇంకొ కరు పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి గా బరిలోకి దిగారు. ఇద్దరూ మంచివా ళ్లే కాకుండా సమర్థులని ఆన్నారు. నియోజకవర్గాల అభివృద్ధికి దోహ దపడతారని, ఆ విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.
కేంద్రంతో సీఎం రమేశ్కి ఉన్న పరిచ యాలు అనకాపల్లి లోక్సభ స్థానం అభివృద్ధికి ఎంతగానో ఉపయోగప డతాయి. తద్వారా పంచకర్ల రమేశ్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కోరు కునే అభివృద్ధి పనులు సజావుగా సాగిపోతాయి. మీ అందరి ఆశీస్సు లు వీరిపై ఉంటాయని నమ్ముతు న్నానని, దయచేసి వీరిద్దరిని గెలిపించాలని నాదో పెద్ద కోరిక అంటూ చిరంజీవి ఆకాక్షించారు. ఆంధ్రప్రదేశ్(AP) అభివృద్ధిపథంలో ముందుకు వెళ్లాలని, దానికి మీరం దరూ నడుం బిగించాలని ఇలాంటి వారికి ఓటు వేసి గెలిపించి మీ ఆశీస్సులు అన్ని విధాలుగా వీరికి ఉన్నాయనే నమ్మకాన్ని మాకు కలి గించండి అని చిరంజీవి అన్నారు. పంచకర్ల రమేశ్ రాజకీయంగా తన దీవెనలతోనే రాజకీయ అరంగేట్రం చేశారని చిరంజీవి ప్రస్తావించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయ న ఎక్కడ ఉన్నా తనతో మాట్లాడు తూనే ఉంటారని వెల్లడించారు.
TDP alliance win in Andhra elections