Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BJP manifesto: బిజెపి ది ప్రజల మేనిఫెస్టో

బీజేపీ మేనిఫెస్టో ప్ర‌జ‌ల మేనిఫెస్టో అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతల తో కలిసి బీజేపీ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వెర్షన్ ‘మన మోడీ గ్యారంటీ 2024’ పేరుతో విడుదల చేశారు.

తెలుగు వర్షన్ మన మోడీ గ్యారంటీ 2024 విడుదల సంధర్బంగా కిషన్ రెడ్డి

ప్రజా దీవెన, హైదరాబాద్: బీజేపీ మేనిఫెస్టో(BJP manifesto) ప్ర‌జ‌ల మేనిఫెస్టో అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతల తో కలిసి బీజేపీ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వెర్షన్ ‘మన మోడీ గ్యారంటీ 2024’ పేరుతో విడుదల చేశారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మోడీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలు చేసేస్తారని చెప్పారు. 2047 వికసి త భారత్ పేరుతో బీజేపీ ముందు కెళ్తోందన్నారు. అవినీతి, బంధు ప్రీతిని కాంగ్రెస్ పూర్తిగా వదిలిపెట్ట లేదని విమర్శించారు. కాగా మోడీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్ తో బీజేపీ రూపొం దించిన జాతీయ మేనిఫెస్టోను వారం ప్రధాని మోడీ, బీజేపీ జాతీ య అధ్యక్షుడు జేపీ నడ్డా, మంత్రు లు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు కలిసి విడుదల చేయగా తాజాగా ఇవాళ తెలంగాణలో తెలుగు మేని ఫెస్టోను రాష్ట్ర నేతలు విడుదల చేశారు.

కాగా బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలో(BJP manifesto) 14 అంశాలను చేర్చా రు. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం, మరో ఐదేళ్లు ఉచిత రేషన్, పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ వంట గ్యా స్, ముద్ర రుణాల పరిమితి రూ. 20 లక్షల వరకు పెంపు, ఎప్పటి కప్పుడు పంటల మద్దతు ధర పెంపు వంటి ముఖ్యమైన హామీలు ఉన్నాయి. సమాజంలోని అట్టడు గున ఉన్న యువకులు, మహిళలు, పేదలు, రైతుల అభ్యున్నతికి పాటు పడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు కిషన్ రెడ్డి అన్నారు.

పంటల బీమా మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు భారత దేశాన్ని మిల్లెట్ హబ్(Millet Hub) గా మర్చు తామని అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అతి పెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ద నున్నట్లు చెప్పారు. నాణ్యమైన విద్య, అందరికీ ఆరోగ్యం, పేదలకు పక్కా ఇళ్లు గ్యారంటీతో పాటు మరో ఐదేళ్ల వరకు ఉచిత బియ్యం ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. పేపర్ లీకేజీ అరికట్టే విషయంలో కఠిన చట్టాలు తీసుకొ చ్చామని, పోస్టాఫీసులను మినీ బ్యాంక్ లుగా మార్చేస్తున్నామని, భారత్ ను సర్వీస్ సెక్టార్ హబ్ గా విస్తరిస్తామని అన్నారు. మత్స్యకా రులను అన్ని రకాలుగా ఆదుకుం టామని దేశ భవిష్యత్ కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచన అన్నా రు.z

BJP people manifesto