Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : ప్రమాణంగా పంద్రాగస్టు రుణ మాఫీ

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు కృతనిశ్చయంతో పని చేస్తోందని ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీని వామపక్షాలు బొందపెట్టేందుకు నడుంకట్టాలి
హామీలన్నీ అమలుచేస్తున్నoదుకే నా ప్రభుత్వాన్ని కూలగొట్టేది
యాదగిరిగుట్టలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తాo
రూ. 60 వేల కోట్లతో మూసీ ప్రక్షా ళన తో సాగునీటి కాల్వలను పూర్తి
కేసీఆర్‌ బిడ్డకు బెయిల్‌ రావాలం టే భువనగిరిలో బీజేపీ గెలవాలా
యాదాధ్రి భువనగిరి ప్రచారంలో సీఎం రేవంత్‌ రెడ్డి
ప్రజా దీవెన, భువనగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు కృతనిశ్చయంతో పని చేస్తోందని ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కార ణంగా అమలుకు నోచుకోని రుణ మాఫీ అనుకున్న సమయానికి అమలు చేసేందుకు రంగం సిద్దం చేశామని స్పష్టం చేశారు. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రమాణo చేసి చెబుతున్నా, ఏది ఏమైనా సరే పంద్రాగస్టులోగా రైతు లకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth reddy) పునరుద్ఘాటించారు.

ఆదివారం ఆయన యాదాద్రి భువనగిరి( Yadadri Bhuvanagiri)జిల్లా కేంద్రంలో భువనగిరి లోక్‌సభ స్థానం అభ్యర్ధి చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన రోడ్‌షోలో మాట్లా డారు. వచ్చే పంట నుంచే వరికి రూ.500 బోనస్‌ ఇచ్చి, ధాన్యాన్ని కొనుగోలు చేస్తా మని స్పష్టం చేశారు. యాదగిరిగుట్టలో భక్తుల కు సౌకర్యాలు కల్పిస్తానని, కుర్చీవేసుకుని ఇక్కడే కూర్చుని మరీ ఆ పనులు చేయిస్తానని చె ప్పారు. తనతోపాటు సీఎంగా పనిచేసే అర్హత ఉన్న వ్యక్తి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

సీఎం పదవి తనకు అర్హత కాదని ఒక బాధ్యత అని గుర్తు చేశారు. భూమికి మూరెడు లేనోడికి చెబుతున్నా కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఫాంహౌస్‌లో మందులో సోడా కలిపి రాజకీయాల్లోకి రాలేదని, సొంత ఆస్తులు కరగబెట్టి ప్రజా సేవ చేస్తున్నారని, మంత్రి పదవిని సైతం తాగ్యం చేసి నల్లగొండ గడ్డపై నిరవ ధిక నిరహార దీక్ష చేశారని వివరిం చారు. అధిష్ఠానాన్ని ఒప్పించి తెలం గాణ రాష్ట్ర సాధనకు కోమటిరెడ్డి బ్రదర్స్‌ కృషి అభినందనీయమని ప్రశంసిస్తూ తెలంగాణ వచ్చాకే మంత్రి పదవి తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు అడవి పందుల్లా మెక్కి బలిసిండ్రు, కేసీఆర్‌ వామప క్షాల మద్దతు తీసుకున్నారు కానీ వారికి కనీస గౌరవం ఇవ్వలేదని చెప్పారు. కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని రూ. 7 లక్షల కోట్ల మేర అప్పులపాలు చేశారని దుయ్య బట్టారు.

స్థానిక నేతలు ఎప్పుడైనా తనను కలవొచ్చని చెబుతూ చామ ల కిరణ్‌ను గెలిపిస్తే భువనగిరిలో ట్రిపుల్‌ ఇంజన్‌ అటువైపు జానా రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇటు వైపు కోమటిరెడ్డి బ్రదర్స్‌ మనకు మనమే పోటీ పడి చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డిని 3 లక్షల మెజారిటీతో గెలిపించాలని కోరారు. భువనగి రిలో ఇప్పటికే డబుల్‌ ఇంజన్‌ ఉందని కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఉద్దేశించి అన్నారు. కిరణ్‌ను(Kiran) గెలిపి స్తే ట్రిపుల్‌ ఇంజన్‌ అవుతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. గందమళ్ల, డిండి, బస్వాపూర్‌ రిజర్వాయ ర్‌లను, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తిచేస్తామని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి, బూనాదిగాని కాల్వలను పునరుద్ధరించేందుకు నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు

. రూ.60 వేల కోట్లతో మూసీ ప్రక్షా ళన చేపడతామని, భువనగిరిని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేం దుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ విప్‌లుగా, రాజ్యసభ్య సభ్యులుగా, ఎమ్మెల్సీ లుగా బడుగు బలహీనవర్గాల నేతలకు అవకాశం కల్పించామని, బీసీ(BC) జనాభా లెక్కల ప్రకారం నిధులు, నియామకాలు చేపట్టేలా తగిన చర్యలు తీసుకుంటా మన్నా రు. బీఆర్‌ఎస్‌ కుటుంబ న్యాయం చేయగా కాంగ్రెస్‌ సామాజిక న్యా యం చేస్తుందని, ఎలక్షన్లు, కలెక్షన్ల పేరుతో కేసీఆర్‌ హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రాప్రాంత వ్యాపారుల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు దోచుకు న్నారని ఆరోపించారు. పదేళ్లపాటు తెలంగాణ తల్లి కేసీఆర్‌ గడీలో కన్నీళ్లు పెట్టుకుంది. ప్రజాధనంతో కట్టిన ప్రజాభవన్‌ను కేసీఆర్‌ గడీగా మార్చారు. గడీల పాలనను బద్ధలు కొట్టి, ప్రజాపాలనను తీసుకొచ్చా మని వ్యాఖ్యానించారు.

15th loan waiver as standard