Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Purchase of Grain : ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు రాకుండా చూడాలి

ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. చివరి వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలనిరాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ సూచించారు.

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడం అభినందనీయం

ఇదే తరహాలో ముందుకు వెళ్లాలి

-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్

ప్రజా దీవెన నల్లగొండ: ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. చివరి వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలనిరాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్(DS Chauhan) సూచించారు.నల్గొండ (Nalgonda) జిల్లాలో రికార్డు స్థాయిలో యాసంగి దాన్యాన్ని కొనుగోలు చేయటమే కాకుండా 213 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం పట్ల జిల్లా కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్, జిల్లా అధికారులను అభినందించారు.2023-24 యాసంగి ధాన్యం సేకరణ పై సోమవారం హైదరాబాద్ నుండి ఆయన అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులు,వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ2022-23 యాసంగి ధాన్యానికి సంబంధించి గత సంవత్సరం ఏప్రిల్ 20 నాటికి నల్గొండ జిల్లాలో 78,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి కేవలం 7 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారని, ఈ సంవత్సరం యాసంగి ధాన్యం కొనుగోలులో భాగంగా ఇప్పటివరకూ రెండు లక్షల 4000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా, 213 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం అభినందనీయమని అన్నారు. రాబోయే రోజులలో సైతం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు.

నల్గొండ జిల్లాలో 2023 -24 యాసంగి (Grain) కొనుగోలు పై జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ కు వివరిస్తూ ఆదివారం కురిసిన వర్షానికి నల్గొండ జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని, ప్రత్యేకించి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దాన్యం తడవలేదని, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన,(Dasari Hari Chandana)రెవెన్యూ అదనపు కలెక్టర్ ల పర్యవేక్షణ మేరకు సంబంధిత శాఖల అధికారుల సహకారంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సరిపోయినన్ని టార్పాలిన్లు, ఇతర ఏర్పాట్లు చేయటం వల్ల వర్షానికి ధాన్యం తడవకుండా రక్షించుకోగలిగామని తెలిపారు.
యాసంగి ధాన్యం కొనుగోలులో భాగంగా నల్గొండ జిల్లాలో ఏ రోజు కొన్న దాన్యాన్ని ఆరోజే మిల్లులకు తరలిస్తున్నామని, ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా 500 లారీలను ఏర్పాటు చేసి ఎప్పటి ధాన్యం అప్పుడే మిల్లులకు పంపిస్తున్నట్లు తెలిపారు.మండల స్థాయిలో ఏపీఎంలు, మానిటరింగ్ అధికారులతో పాటు, తహసిల్దారులు ధాన్యం కొనుగోళ్లను పర్యవేస్తున్నారని, డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు ఎలాంటి సమస్యలు రాకుండా పర్యవేక్షణ చేస్తున్నారని, జిల్లా స్థాయిలో జిల్లా పౌరసరఫరాల అధికారి ,కో-ఆపరేటివ్ అధికారి, డిఆర్డిఓ, జిల్లా వ్యవసాయ అధికారి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు.

యాసంగి ధాన్యం కొనుగోలు పై ప్రతిరోజు జిల్లా కలెక్టర్,రెవెన్యూ అదనపు కలెక్టర్ ఇచ్చే సూచనలు, ఆదేశాలను తూ.చా తప్పకుండా పాటిస్తూ ధాన్యం కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు వెల్లడించారు. రైస్ మిల్లుల వద్ద ఎలాంటి అన్లోడింగ్ సమస్య లేదని, ఎప్పటి దాన్యాన్ని అప్పుడే మిల్లర్లు అన్లోడ్ చేసుకునే విధంగా జిల్లా కలెక్టర్ మిల్లర్లతో తరచూ సమావేశాలు నిర్వహించి సూచనలు ఇవ్వడం జరిగిందని ఆయన వెల్లడించారు. రైస్ మిల్లర్లతో డిప్యూటీ తహసిల్దారులు, వ్యవసాయ అధికారుల సమన్వయంతో సమస్యలు లేకుండా పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి జిల్లా పౌర సరఫరాల మేనేజర్ నాగేశ్వరరావు, జిల్లా కోపరేటివ్ అధికారి కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, డిఆర్డిఓ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

It should be difficulty buying grain