Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు

GHMC కమిషనర్‌గా రోనాల్డ్ రోస్

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు

GHMC కమిషనర్‌గా రోనాల్డ్ రోస్

ప్రజా దీవెన/ హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా రోనాల్డ్ రోస్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ ఓఎస్‌డీగా ఉన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌ను అదనపు ఎన్నికల ప్రధానాధికారిగా నియమించడంతో ఈ మార్పులు జరిగాయి. మొత్తం నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ను జాయింట్ సీఈఓగా నియమించడంతో ఆ స్థానంలో వెయిటింగ్‌లో ఉన్న ముషర్రఫ్ ఆలీ ఫారూఖీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.