Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KCR Road Show: రెండు ఎంపీ స్థానాలు.. మూడు రోడ్డు షోలు

తెలంగాణ మలిదశ ఉద్యమానికి కేంద్ర బిందు.. ఎన్నో ఉద్యమాలకు నిలవైన పోరాటాల పురిటిగడ్డ నల్గొండ ఉమ్మడి జిల్లాపై గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు.

ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పర్యటన

రెండు రోజుల పాటు యాత్ర

రెండు పార్లమెంట్ సీట్లపై గురి

శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న గులాబీ బాస్

ప్రజా దీవెన నల్లగొండ బ్యూరో: తెలంగాణ (Telangana)మలిదశ ఉద్యమానికి కేంద్ర బిందు.. ఎన్నో ఉద్యమాలకు నిలవైన పోరాటాల పురిటిగడ్డ నల్గొండ ఉమ్మడి జిల్లాపై గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా రెండు రోజుల పాటు ఉమ్మడి జిల్లా ల్లో జరిగే రోడ్ షోల్లో పాల్గొననున్నారు.

నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల్లో మరోసారి గులాబీ జెండా ఎగురవేసి కాంగ్రెస్, బీజేపీలకు ధీటైన సమాధానం చెప్పేందుకు పార్టీ ఆరిష్టానం తీవ్రం గా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ అధినేత ఉమ్మడి జిల్లాలోని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్ లకు ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.

కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాలు ఎత్తిచూపేలా కేంద్రంలోని బీజేపీతో రాష్ట్రానికి, జిల్లాకు ప్రత్యే కంగా ఒరిగిందేమీ లేదని, సాధారణ నిధులే తప్పా ప్రత్యేకమైన ప్యాకేజీలు, హోదాలు, పరిశ్ర మలు, ప్రాజెక్టులు సాధించలేకపోయారని, రాష్ట్ర విభజన సందర్భంలో ఇచ్చిన హామీలే ఆటకెక్కిం చారని, ఉమ్మడి జిల్లాకు లో ఏ ఒక్క అభివృద్ధి పని కూడా చేయించడంలో బీజేపీ (BJP)ఘోరవైఫల్యం చెందిందనే విషయాన్ని ప్రజలకు రోడ్ షో లో వివరించాలని పార్టీ అధిష్టానం నిర్ణ యించినట్లు వినికిడి. కాంగ్రెస్ అడ్డగోలు అబద్దపు హామీలు ఇచ్చి ప్రజలను గందరగోళంలో పడేసి ఓట్లు దండుకుందని, నాలుగు నెలల్లో స్వయానా
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకే దిక్కులేకుండా పోయిందని ప్రజాక్షేత్రంలో ఎత్తిచూపేందుకు గులాబీ దళపతి సన్నద్ధమయ్యారు.

రెండు సీట్లపై గురి… ఉమ్మడి జిల్లా పరిధిలోని

నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొని పూర్వ వైభవాన్ని పొందాలని బీఆర్ఎస్ ఆశిస్తోంది. బిఆర్ఎస్(BRS) ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి పనులు వివరించి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగేలా పార్టీ అధినేత కేసీఆర్ ద్వితీయ శ్రేణి నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.నల్గొండ నుండి నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేయనుండగా భువనగిరి స్థానం నుండి క్యామ మల్లేష్ పోటీ చేస్తున్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ విషయాన్ని ఓటర్లకు విశదీకరించి ప్రచారాన్ని వేగం చేసేలా.. అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పార్టీ అధినేత క్యాడర్ కు దిశానిర్దేశనం చేయనున్నట్లు సమాచారం.

కేసీఆర్ రోడ్ షోలు ఇలా…

ఉమ్మడి నల్గొండ జిల్లా నుండే కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర నేటి నుంచి 17 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది. ఈ యాత్ర రెండు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో ఉండనుంది.
తొలిరోజు బస్సు యాత్ర బేగంపేట, ఉప్పల్, ఎల్బీ నగర్ మీదుగా విజయవాడ రహదారిపైకి చేరుతుంది. వనస్థలిపురం, హయత్ననగర్, అబ్దుల్లాపూర్ మెట్ దాటిన తర్వాత చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనితో పాటు ఉమ్మడి నల్లగొం డ జిల్లాలో దారి పొడవునా కేసీఆర్ కు ప్రజలు, కార్యక ర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికేలా ఇప్పటికే మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నేతలకు దిశా నిర్దేశం చేశారు. నకిరేకల్ క్రాస్ రోడ్ నల్లగొండ, మాడుగులపల్లి మీదుగా సాయంత్రం 5 గంటలకు మిర్యాలగూడ ఫ్లైఓవర్ వద్దకు యాత్ర చేరుకుంటుంది.

సాయంత్రం 5:30కి రాజీవ్ చౌక్ వద్ద రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం వేములపల్లి, మాడుగులపల్లి తిప్పర్తి మీదుగా రాత్రి 7 గంటలకు సూర్యాపేటకు(Surya pet) చేరుకుని రోడ్ షోలో ప్రసంగిస్తారు. సూర్యాపేటలోనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ రాత్రి బస చేస్తారు. గురువారం ఉమ్మడి జిల్లాలోని రెండు పార్ల మెంట్(Parliament) స్థానాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రచారం తీరుతెన్నులను సమీక్షించి దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయలుదేరి చిట్యాల, రామన్నపేట మీదుగా భువనగిరి చేరుకుని అక్కడ జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం రాత్రి బస కోసం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకుంటారు. శుక్రవారం నుంచి మరో 15 రోజులు పాటు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుంది.

కిలోమీటర్ మేర రోడ్ షో

ప్రతిచోటా కిలోమీటర్ మేర రోడ్ షో కొనసాగుతుంది. అనంతరం కేసీఆర్ ప్రసంగి స్తారు. రోజూ రోడ్ షో ముగిసిన తర్వాత లేదా మరుసటి రోజు ఉదయం కేసీఆర్(KCR) విలేక రులతో మాట్లాడతారు. దీంతో పాటు ఉదయం వేళల్లో వివిధ సామాజికవర్గాలతో భేటీలు, క్షేత్ర స్థాయి సందర్శనలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా కేసీఆర్ బస్సు యాత్ర వెంట వెళ్లే వలంటీర్లకు ఎక్కడికక్కడ బస ఏర్పాట్లు చేశారు. పార్టీ జిల్లా కార్యాలయాల్లో భోజన సదు పాయం కల్పిస్తున్నారు.

KCR road shows in Nalgonda