Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Karimnagar: భయబ్రాంతులకు గురిచేసే ఐదుగురికి రిమాండ్

నఖీలీ ధ్రువ పత్రాలు సృష్టించడమే గాక, అక్రమంగా ఇంట్లోకి చొరబడి పలు ఇల్లు కూల్చడo తో పాటు ప్రజలను భయ బ్రాంతులను గురి చేసిన కేసులో ఐదుగురి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన కరీంనగర్ రూరల్ పోలీసులు తెలిపారు.

ఇంట్లోకి చొరబడి పలు ఇల్లు కూల్చిన కేసులో అరెస్టు
ప్రజా దీవెన, కరీంనగర్: నఖీలీ ధ్రువ పత్రాలు సృష్టించడమే గాక, అక్రమంగా ఇంట్లోకి చొరబడి పలు ఇల్లు కూల్చడo తో పాటు ప్రజలను భయ బ్రాంతులను గురి చేసిన కేసులో ఐదుగురి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన కరీంనగర్(Karimnagar) రూరల్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం కరీంనగర్ ఆదర్శనగర్ కు చెందిన మొహమ్మద్ లతీఫ్ (38) 2017 వ సంవత్సరం జులై(July) నెలలో కరీంనగర్ రేకుర్తిలోని సర్వే నెంబర్ 194 లో గల 61వ ప్లాట్, 248 చదరపు గజాల ఇంటి స్థలాన్ని, సిద్దిపేట జిల్లా ప్రశాంత్ నగర్(Prashanthnagar) కు చెందిన సయ్యద్ జైనాబీ భర్త నిజామొద్దీన్ నుండి కొనుగోలు చేసారు.

సదరు స్థలంలో నివసిం చుటకు సంబంధిత గ్రామ పంచా యితిలో ఇంటి నిర్మాణానికి అను మతి పొంది ఇంటిని సైతం నిర్మిం చుకుని నివసిస్తున్నారు.ఇదిలా ఉండగా 2023 మే నెల 13 వ తేదీన అకస్మాత్తుగా ఐదుగురు వ్యక్తులు బారాజు రత్నాకర్ రెడ్డి, చందా శంకర్ రావు,బకిట్ సాయి,పిట్టల మధు, షాహిద్ ఖాన్ అనే వ్యక్తులతో పాటు మరి కొంత మంది దౌర్జన్యంగా ఇంట్లో చొరబడి మమ్మల్ని బలవంతంగా ఇంట్లో నుండి బయటకు నెట్టి వేసి నా ఇంటిని జేసీబీ (JCB)తో కూల్చివేశారని, నాతో పాటు మా కాలనీకి చెందిన మరి కొంతమంది పేదవారి ఇండ్లు కూడా కూల్చేసి, మీకు ఈ భూమిపై ఎలాంటి హక్కు లేదని హెచ్చరిం చారని తెలిపారు.

వారి వద్ద అప్ప టికే సృష్టించుకుని ఉన్న నఖీలీ ధృవపత్రాలతో పాటు సయీద్ ఖాన్ వారసులతో డెవలప్మెంట్ కింద అగ్రిమెంట్(Agreement) కూడా అయిందని, దానికి సంబందించిన ఒక నకిలీ జిరాక్స్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ కాపీ మాకు చూపించి ఇళ్ళు ఖాళీ చేయాలనీ లేని యెడల చంపే స్తామని బెదిరింపులకు గురి చేసారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కొత్తపల్లి పోలీసులు, విచా రణ అనంతరం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు వాస్తవమేనని తేలినం దున పైన తెలిపిన ఐదుగురి వ్యక్తులను మంగళవారంనాడు అరెస్ట్ చేసి వారిపై ఐపీసీ 452, 448,427,506,467,468,
120-B, r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా గౌరవ మేజిస్ట్రేట్ నిందితుల ఐదుగురికి 14 రోజుల రిమాండ్ విధించగా వారిని కొత్తపల్లి పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Five members arrested in Karimnagar