Medigadda Barrage: కమీషన్ ను కలిసిన మంత్రి ఉత్తమ్
జస్టిస్ చంద్ర గోష్ కమిషన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు.
ప్రజా దీవెన, హైదరాబాద్: జస్టిస్ చంద్ర గోష్ కమిషన్తో(Justice Chandra Ghosh Commission)మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. నేటి నుంచి బ్యారేజీలపై కమిషన్ విచా రణ ప్రారంభమైంది. ఈ క్రమం లో మొదటిరోజు కావడంతో కమిష న్ను మంత్రి ఉత్తమ్ మర్యాద పూ ర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్ర గోష్ కమిషన్కు కాళేశ్వరం అంశాలపై చర్చిస్తూ వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిషన్ ను మంత్రి విజ్ఞప్తి చేశారు. జస్టిస్ చంద్ర గోష్ కమిషన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు.
నేటి నుంచి బ్యారేజీలపై కమిషన్ విచారణ ప్రారంభమైన క్రమంలో మొదటి రోజు కావడంతో కమిషన్ను మంత్రి ఉత్తమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్ర గోష్ కమిషన్కు కాళేశ్వరo (Kaleshwaram project) అంశా లను తెలియజేశారు. కమిషన్ అడిగిన వివరాలు, కమీషన్కు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని కమిషన్కు ఉత్తమ్కుమార్ స్పష్టం చేశారు.అనంతరం మంత్రి మీడి యాతో మాట్లాడుతూ జస్టిస్ చంద్ర ఘోష్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ ఎంక్వయి రీకి చీఫ్గా జస్టిస్ చంద్ర ఘోష్ ఉన్నారన్నారు. మేడిగడ్డ(Madigadda) నిజానిజాలు తేల్చడానికే ప్రభుత్వం కమిషన్లు వేసిందన్నారు. చంద్ర గోష్కు లీగల్ అంశాలపై పూర్తి స్థాయి అవగాహన ఉందని తెలిపారు. కాళేశ్వరంపై జ్యుడీషియల్ విచారణ మొదలైందన్నారు. ఎన్డీఎస్ఏ నుంచి మరో నాలుగు నెలల్లో తాత్కాలిక రిపోర్ట్ వస్తుందని చెప్పారు. మేడిగడ్డ అంశంపై ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగానే కార్యచరణ ఉంటుందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
Uttam kumar meets Medigadda barrage commission