Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Malla reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెరువులు, పొలాలు ఎండిపో యాయి

తెలంగా ణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి చెరువులు, పొలాలు ఎండిపోయి కరువు ఛాయలు అలుముకున్నాయని మాజీ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు.

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో కాంగ్రెస్ పార్టీ (congress govt) అధికారంలోకి వచ్చేసరికి చెరువులు, పొలాలు ఎండిపోయి కరువు ఛాయలు అలుముకున్నాయని మాజీ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇస్తామన్న రూ. 4000 పింఛన్ ఇంకా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమం త్రిగా కేసీఆర్ పరిపాలన చాలా బాగుండేదని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ కూకట్ పల్లిలో ఎంఎల్ ఏ మాధవరం కృష్ణారావు ఇంట్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హీరో మహేష్ బాబు కంటే ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంకా అందంగా ఉంటారని అన్న మల్లారెడ్డి చమత్క రించారు. దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ గా నిలిపిన కేసీఆర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్(BRS Party) మెజారిటీ ఎంపీ సీట్ల ను గెలవబోతున్నామని జోష్యం చెప్పారు.

కెసిఆర్ఐ లో కరెంటు, వసతులు అన్నీ టైమ్ కి వచ్చేవని, రేవంత్ ప్రభుత్వం తిట్ల తోనే నెట్టుకురావాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా లో కూడా బిల్డర్లు బాగా వ్యాపారం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) ఇచ్చిన 100 రోజులు పూర్తయ్యాయని, ఇచ్చిన హామీలు విస్మరించినందున ప్రజలు ఎంపీ ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

కాంగ్రెస్ వద్దు, కేసీఆర్ ముద్దు అని ప్రజలు అప్పుడే ప్రచారం ప్రారంభించారని, మల్కాజిగిరి లో కాంగ్రెస్, బీజేపీ లు అభ్యర్థులను దిగుమతి చేసుకున్నాయని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మట్లాడుతూ కొడంగల్ లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీ గా గెలిస్తే ప్రజల గొంతుక వినిపిస్తానని చెప్పి అడ్రస్ లేకుండా పోయాడని విమ ర్శించారు. మల్కాజ్ గిరి ప్రజలను మోసం చేసిన అప్పటి ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రానికి సిఎం అయ్యారని ఇది ప్రజల దౌర్భాగ్యం అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మహేంద ర్ రెడ్డి ఫ్యామిలీలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చారని, ప్రభుత్వ మారిన వెంటనే మూడు నెలలు కూడా ఆగకుండా పార్టీ మారడం చాలా బాధాకరం చెప్పారు.25 సంవత్సరాలుగా తాను ప్రజా జీవి తంలో ఉన్నానని, ప్రజలు తప్ప కుండా తనను భారీ మెారిటీతో గెలిపిస్తారు అనీ, రేవంత్ నీ ఎంపీ గా గెలిపిస్తే మా ఎంపీ కనుబడటం లేదు అనీ స్థానిక పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదు చేశారని

గుర్తు చేశా రు.

Malla reddy criticise on congress govt