Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

India Constitution: రాజ్యాంగం అంటే కాంగ్రెస్ కు ద్వేషం

కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగాన్ని ద్వేషిస్తోందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన కోటాను ముస్లింలకు కట్టబెట్టాలని కుట్రలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుర్తించారు.

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానిస్తోంది
ఎస్సీ, ఎస్టీ, బీసీల రాజ్యాంగ హ క్కుల హననానికి కాంగ్రెస్‌ యత్నం
కొలువులకు కొరివి పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది
భోపాల్ రోడ్‌షోలో ప్రధాని మోదీ

ప్రజా దీవెన, భోపాల్‌: కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగాన్ని ద్వేషిస్తోందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన కోటాను ముస్లింలకు కట్టబెట్టాలని కుట్రలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi)తీవ్రస్థాయిలో ఆరోపణలు గుర్తించారు. 2009, 2014 ఎన్నికల మేనిఫెస్టోల్లోనూ కాంగ్రెస్‌ మతపర మైన రాజకీయాలను గురించి ప్రస్తా వించిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ చర్యలను చౌకీదార్ గా అడ్డుకుంటానని, ఆ పార్టీని నిలువరించడానికి లోక్‌సభలో 400 సీట్లు కావాల్సిన అవసరం అనివా ర్యమని ఆకాంక్షించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని బరేలీ, భోపాల్ లలో జరిగిన రోడ్‌షోలలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తన వాగ్యుద్ధాన్ని మరింతగా పెంచారని, సంపద దోపిడీ, వారసత్వ పన్ను, ముస్లిం రిజర్వేషన్ల పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీల రాజ్యాంగ హక్కుల హ ననానికి కాంగ్రెస్‌ యత్నిస్తోందంటూ పలు ఎన్నికల ర్యాలీల్లో విరుచుకు పడ్డ మోదీ తాజాగా ఉద్యోగాలపైనా పంజా అంటూ కాంగ్రెస్ పార్టీ (Congress party)ఎన్నికల గుర్తు చేతి గుర్తుపై వ్యం గ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే.

మీరు బీసీ లేదా ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందినవారై ఉండి మీ ఇంట్లో ఇద్దరికి ఉద్యోగాలు ఉంటే ఒక కొలువును కాంగ్రెస్‌ లాక్కొంటుం దని పునరుద్ఘాటించారు. దేశ సంపదపై ప్రథమ హక్కు దారులకు ఆ ఉద్యోగాన్ని పంచిపెడుతుందని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ కలిసి. ఓబీసీ ల హక్కులకు ఎసరుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని మోదీ హెచ్చరించారు. ఓబీసీల హక్కు లను ముస్లింలకు అందజేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

సమాజ్‌వాదీ దృష్టిలో బీసీలంటే యాదవులేనా, యాదవులంటే వారి కుటుంబం సభ్యులేనా, బుదౌన్‌, మణిపురి, ఫిరోజాబాద్‌, ఆజంగఢ్‌, కన్నౌజ్‌లలో వారి కుటుంబ సభ్యుల కే టికెట్లు ఇచ్చుకున్నారని మండిప డ్డారు. పేరుకు యాదవులమనే చెప్పుకొంటారు కానీ, శ్రీకృష్ణుడిని అవమానిస్తారని అఖిలేశ్‌ కుటుంబా న్ని విమర్శించారు. నేను సముద్రగ ర్భంలో ద్వారకను సందర్శించిన ప్పుడు రాకుమారుడు ఆటపట్టిం చేలా మాట్లాడారని, ఇప్పుడు ఆ రాకుమారుడికి అఖిలేశ్‌ హారతిప డుతున్నారని అంటూ విరుచుకు పడ్డారు.

కాంగ్రెస్‌–సమాజ్‌వాదీ పార్టీలపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీలు ఉత్తరప్రదేశ్‌లో తమ ఓటుబ్యాంకు కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఇందిరా గాంధీ మృతి తరువాత అధికారంలోకి వచ్చిన రాజీవ్‌ గాంధీ,(Rajiv Gandhi)ఆమె సంపద ప్రభుత్వ పరం కాకుండా చూడటానికే అప్పట్లో వారసత్వ పన్నును రద్దు చేశారని మోదీ ఆరోపించారు.వారసత్వ పన్నును కాంగ్రెస్‌ మళ్లీ తెస్తానం టోందన్నారు. కాంగ్రెస్‌ లూటీ నుంచి ప్రజల సంపదను కాపాడితీరతానని ప్రధాని స్పష్టం చేశారు.

Congress insulting Ambedkar Constitution