Srichayaswameswara Temple: ఛాయా సోమేశ్వర ఆలయాన్ని సందర్శించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ – అలోక్ ఆరాదే
నల్లగొండ పట్టణంలోని పానగల్ లోగలశ్రీచాయస్వామేశ్వరాలయాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక ఆరాదే శనివారం సందర్శించి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
ప్రజా దీవెన నల్గొండ: నల్లగొండ పట్టణంలోని పానగల్ లోగలశ్రీచాయస్వామేశ్వరాలయాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక ఆరాదే శనివారం సందర్శించి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంత రెడ్డి ఆధ్వర్యంలో చీఫ్ జస్టిస్, హైకోర్టు జడ్జి లకు వేద పండితులచే పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం చీఫ్ జస్టిస్ గర్భగుడిలోని శివలింగానికి ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆరాదే మాట్లాడుతూ ప్రాచీన దేవాలయాలను కాపాడుకోవాలని అన్నారు.
అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ జ్ఞాపికను అందజేసి ఆలయ విశిష్టతను చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి లు బి. విజయసేన్ రెడ్డి, టి. వినోద్ కుమార్, కే. లక్ష్మణ్, జిల్లా జడ్జ్ ఎం. నాగరాజు, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్, ఏఎస్పి రాముల నాయక్, డీస్పీ శివరాంరెడ్డి, ఆలయ ఈవో సత్యనారాయణ, ఆలయ అర్చకులు అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, రామలింగేశ్వర శర్మ, సోమశేఖర్, రవి, భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
High Court Chief Justice visited Srichayaswameswara Temple