Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MGU Doctorate: ప్రిన్సిపాల్ పరంగి రవికుమార్ కు ఎం జి యు డాక్టరేట్

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర అధ్యాపకులు డా దోమల రమేష్ పర్యవేక్షణలో సింథసిస్ బయోలాజికల్ యాక్టివిటీ అండ్ డాకింగ్ స్టడీస్ ఆఫ్ 1,3,4 ఆక్స డయాజోల్- 2- ఎమీన్ ఆఫ్ 1,8- నాఫ్తా రెడీన్, నాఫ్తాలీన్ అండ్ బెంజిన్ డెరివేటివ్స్ " అంశంపై పరిశోధన చేసినందుకు గాను పరంగి రవికుమార్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు.

ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం(Mahatma Gandhi University) రసాయన శాస్త్ర అధ్యాపకులు డా దోమల రమేష్ పర్యవేక్షణలో సింథసిస్ బయోలాజికల్ యాక్టివిటీ అండ్ డాకింగ్ స్టడీస్ ఆఫ్ 1,3,4 ఆక్స డయాజోల్- 2- ఎమీన్ ఆఫ్ 1,8- నాఫ్తా రెడీన్, నాఫ్తాలీన్ అండ్ బెంజిన్ డెరివేటివ్స్ ” అంశంపై పరిశోధన చేసినందుకు గాను పరంగి రవికుమార్(Parangi Ravikumar) డాక్టరేట్ పట్టా అందుకున్నారు. తన పరిశోధన గ్రంథాన్ని ఏప్రిల్ 24 న సీనియర్ అధ్యాపకులు మరియు అధికారుల సమక్షంలో సమర్పిస్తూ తన పరిశోధన ప్రధాన అంశాలను వివరించారు.

ఈ కాంపౌండ్ యాం టీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరి యల్ గా ఉపయోగిం చవచ్చునని, మరి కొంత ప్రయోగంతో డ్రగ్ గా రూపొం దించి ఫార్మా రంగానికి అందించవ చ్చునని తెలిపారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి, రిజిస్టర్ ఆచా ర్య అల్వాల రవి , సూపర్వైజర్ దోమల రమేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. తరంగి రవికుమార్ ప్రస్తుతం హాలియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎఫ్ఎసి ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు కళాశాల అధ్యాపకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Principal Parangi Ravikumar got MGU Doctorate