Mayday: మేడే స్పూర్తితో బీజేపీ విధానాలపై పోరాడుదాం
ప్రపంచ కార్మిక పోరాట దినోత్సవం 138వ మేడే సందర్భంగా నల్లగొండ పట్టణంలో శ్రామిక భవన్ గవర్న మెంట్ హస్పటల్, లీలావతి హాస్పిటల్, వి.టి కాలనీ తదితర సెంటర్స్ ల్లో CPI (M-L) న్యూడెమోక్రసీ ,ఇఫ్టూ ఆధ్వర్యంలో ఎర్రజెండాలు
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రపంచ కార్మిక పోరాట దినోత్సవం 138వ మేడే(Mayday) సందర్భంగా నల్లగొండ(Nalgonda) పట్టణంలో శ్రామిక భవన్ గవర్న మెంట్ హస్పటల్, లీలావతి హాస్పిటల్, వి.టి కాలనీ తదితర సెంటర్స్ ల్లో CPI (M-L) న్యూడెమోక్రసీ ,ఇఫ్టూ ఆధ్వర్యంలో ఎర్రజెండాలు ఎగురవేసి ఘనంగా 138వ మేడేను జరిపారు.
ఈసం దర్భంగా CPI (M-L) న్యూడెమో క్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్,IFTU జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్ లు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రభుత్వం, ఎన్నో పోరాటాలు చేసి సాధిం చుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులు గా కుదించి కార్మికులను కట్టు బానిసలుగా చేసే కుట్రకు వడిగట్టిందన్నారు. 8 గంట లకు బదులు 12 గంటలు పనిచేసే విధానాన్ని తీసుకువచ్చి కార్పొరేట్, బహుళజాతి సంస్థలకు అను గుణంగా వ్యవహరిస్తోందని తెలిపారు.
రైతు వ్యతిరేక చట్టా లను తీసుకొచ్చి రైతులను(Farmer) మోసం చేశాడన్నారు.దేశంలో మత విద్వేషాలను రెచ్చ గొడుతూ ప్రజల మధ్య ఐక్య తను, శ్రమజీవుల మధ్య ఐక్యత పై దాడి చేస్తుంద న్నారు. కార్మిక వర్గం ఇటువంటి విభజన విధానాలను తిప్పికొ ట్టాలని బిజెపి(BJP) కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని, బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరి స్తున్న కార్మిక చట్టాల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల ను ప్రైవేటీకరణ, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను పెంపు వంటి ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, స్కీం రంగాల కార్మికులను రెగ్యుల రైజ్ చేయాలని, కార్మిక వర్గం ఐక్య తను విస్తృతం చేసి బలమైన కార్మిక పోరాటాలు నిర్వహించాల్సి న అవసరం ఎంతైనా ఉందని కార్మిక వర్గానికి పిలుపునిచ్చా రు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం మోటర్ రంగ కార్మికులకు ఇచ్చిన హామీల మేరకు నెలకు 15వేలు హార్దిక సహాయం అందించి ఆదుకో వాలని, అసంఘటిత కార్మికులకు ఉద్యోగ,సామాజిక భద్రత కల్పించా లని, వేతనాలను ప్రతినెల ఇవ్వా లని అన్నారు. కేంద్రం లో,రాష్ట్రంలో పాలకులు అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతి రేకత విధానాలపై కార్మికులు, ప్రజలు ఉద్యమిం చాలని , మేడే వారోత్సవాలు వాడవాడలా జరపాలని, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు.
ఈకార్యక్రమంలో పి.వై.ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి చారి, పిడి ఎస్యు జిల్లా కార్యదర్శి పోలె పవన్, భారత కార్మిక సంఘాల సమాఖ్య రావుల వీరేష్, జానపాటి శంకర్, కత్తుల లింగ స్వామి,బీరెడ్డి సత్తి రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, చింతల వెంకట రమణ, దాసరి నర్సింహా,మాగి క్రాంతి, శంకర్ అక్కనపల్లి అంజి, తదితరులు పాల్గొన్నరు.
Fight against BJP’s policies mayday spirit