Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

International labour day: కార్మికుల రాజ్యం రావాలి

దేశంలోప్రజలను పట్టిపీడించే దోపిడీదారుల రాజ్యం పోయి దేశ సంపద సృష్టిస్తున్న కార్మికుల రా జ్యాం కొరకు పోరాడుదాం అని కార్మిక కర్షక హక్కులకై నిరంతరం కృషి చేద్దామని సిపిఎం జిల్లా కార్య దర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి అన్నారు.

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: దేశంలోప్రజలను పట్టిపీడించే దోపిడీదారుల రాజ్యం పోయి దేశ సంపద సృష్టిస్తున్న కార్మికుల రా జ్యాం కొరకు పోరాడుదాం అని కార్మిక కర్షక హక్కులకై నిరంతరం కృషి చేద్దామని సిపిఎం జిల్లా కార్య దర్శి వర్గ సభ్యురాలు పాలడుగు ప్రభావతి అన్నారు. మేడే(Mayday) సంద ర్భంగా కనగల్లు మండల కేంద్రంలో సిపిఎం(CPM) పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడు తూ కార్మికులు కర్షకులు ఈ దేశ నిర్మాతలని వారి హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు పతనం కాక తప్పదని హెచ్చరించారు.

అమెరికా నగరం చికాగో(chicago) పట్టణంలో లక్షలాదిమంది కార్మికులు 12 గంటల పని విధానం రద్దుయ్యే వరకు పోరాడి వీలది మంది కార్మికులు ఆత్మబలిదానం చేసిన రోజు మే 1 మే డే దినోత్సవం అని తెలిపారు. సమస్త ప్రజలకు మేడే(Mayday) శుభాకాంక్షలు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచడం కార్మికుల చట్టాలను రద్దుచేసి లేబర్ కోడ్ల ద్వారా కార్మికులను అణిచివేసే కుట్రలకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో కార్మిక కర్షక రాజ్యం ఆవిర్భావం తప్పక జరుగుతుందని అన్నారు.

సిపిఎం నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాల నిర్వహిస్తుందని భూమి బుక్తీ విముక్తికై సాగిన తెలంగాణ సాయుధ పోరాట వారసులుగా భవిష్యత్తులో అనేక ఉద్యమాలకు రూపకల్పన చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కందుల సైదులు మండల కమిటీ సభ్యులు కాానుగు లింగుస్వామి, ఎండి అక్రమ్, నెలగొందరాసి లింగయ్య, ఎండి సుల్తానా , బ్రహ్మానంద రెడ్డి , పార్వతమ్మ , మంజుల, మామిడి యాదయ్య, వేముల సాయమ్మా, వలికి యాదయ్య, వేముల రామలింగo ,వెంకన్న , పార్వతమ్మ , తదితరులు పాల్గొన్నారు.

International labour day