Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kishan reddy: అవును మీది గాడిద గుడ్డు పాలనే

తెలంగా ణలో గాడిదగుడ్డు పరిపాలన సాగు తోందని, ఆ విషయాన్ని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రజల ముందు ఒప్పుకుంటున్నా డని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో బిఆర్ఎస్ అధినే త కేసీఆర్‌ హామీలిచ్చి మసిపూసి మారేడుకాయ చేసేవారని, ఇప్పు డు రేవంత్‌ రెడ్డి గ్యారంటీల అమ లుకు బదులు గాడిదగుడ్డు ఇస్తు న్నారని వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో ఎక్కడికెళ్లినా గాడిద గుడ్డుతో ప్రచారమే నిదర్శనం
గ్యారంటీల అమలు అటకెక్కించి గాడిదగుడ్డు చూపిస్తున్నారు
ఐదు మసాలా కాంగ్రెస్‌ మార్కు పరిపాలనకు తార్కాణం
రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం
మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలంగా ణలో గాడిదగుడ్డు పరిపాలన సాగు తోందని, ఆ విషయాన్ని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy)స్వయంగా ప్రజల ముందు ఒప్పుకుంటున్నా డని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో బిఆర్ఎస్ అధినే త కేసీఆర్‌(kcr) హామీలిచ్చి మసిపూసి మారేడుకాయ చేసేవారని, ఇప్పు డు రేవంత్‌ రెడ్డి గ్యారంటీల అమ లుకు బదులు గాడిదగుడ్డు ఇస్తు న్నారని వ్యాఖ్యానించారు. శుక్రవా రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌ ఎక్కడకు వెళ్లినా వారి పార్టీ చెయ్యి గుర్తు బదులు గాడిద గుడ్డు ను తలపై పెట్టుకుని ప్రచారం చేస్తు న్నారని, కాంగ్రెస్‌(congress) చెయ్యి గుర్తు నుం చి గాడిద గుడ్డు గుర్తుకు మారిన ట్లుందని ఎద్దేవా చేశారు.

అధికారం లోకి వచ్చిన ఐదు మాసాల్లో కాంగ్రె స్‌ అవినీతి మార్కును చూపిస్తున్నా రని, రాష్ట్రంలో కల్వకుంట్ల పాలన పోయి, సోనియా కుటుంబ పాలన వచ్చిందని, మార్పు అంటే ఇదేనా అని ఆయన నిలదీశారు.100 రో జుల్లో గ్యారెంటీలు అమలు చేయ లేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని ధ్వజమెత్తారు. ప్రజలను వెన్నుపో టు పొడిచిన కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కులేదన్నారు. ఎన్నికల ప్రచారంలో వాస్తవాలకు విరుద్ధంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో రైల్వేల కోసం యూపీఏ హయాంలో ఎన్ని నిధులు ఇచ్చారో ప్రధాని మో దీ వచ్చాక ఎన్ని నిధులు ఇచ్చామో అనేదానిపై చర్చకు రావాలని సవా ల్‌ చేశారు. రిజర్వేషన్లపై కావాలనే కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు.

రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించి చీలి కల ద్వారా రాజకీయ లబ్థి పొందా లని కాంగ్రెస్‌, సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth reddy) కుతంత్రానికి తెర లేపారని మండి పడ్డారు. ఒక వర్గం వారి ఓట్ల కోసం బీజేపీపై బురదజల్లడం సరికాద న్నారు. దళితులు, బీసీల పట్ల కాంగ్రెస్‌ మొసలికన్నీరు కారుస్తోం దని, అడుగడుగునా అంబే డ్కర్‌ను అవమానపరిచిన చరిత్ర కాంగ్రెస్‌(congress) పార్టీదని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి డీఎన్‌ఏలో కాంగ్రెస్‌ లేదని, అందుకే ఆ పార్టీ చరిత్ర ఆయనకు తెలియదన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేసే ప్రతిపాదన ఏదీ లేదని, దీనిపై ప్రకటనలు చేస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు పగటి కలలు కంటున్నారని లక్ష్మణ్‌ అన్నారు. కాగా, వరంగల్‌కు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, హైదరాబాద్‌ నగరానికి చెందిన కొంతమంది ఐటీ కంపెనీల యజమానులు బీజేపీలో చేరారు.

Kishan reddy criticised on Revanth reddy