Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish rao: అధికారమదంతో కాంగ్రెస్ నేతల నేలవిడిచి సాము

రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్ నేతలు అధికార మదంతో నేల విడిచి సాము చేస్తున్నారని, ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ధ్వజమె త్తారు.

హామీల అమలులో కాంగ్రెస్, బీజేపీ దొందు దొందే
నల్లగొండ ఎంపీగా కంచర్ల కృష్ణా రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి
నల్లగొండ రోడ్ షో లో మాజీ మంత్రి హరీష్ రావు

ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్(Congress) నేతలు అధికార మదంతో నేల విడిచి సాము చేస్తున్నారని, ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish rao) ధ్వజమె త్తారు. ఎన్నికల ముందు అధికారం లోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలు లో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన నల్లగొండ పట్ట ణంలో ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా పెద్ద గడియారం కూడలిలో ఆయన ప్రసంగించారు.

Congress and BJP fail promises in nalgonda

ఇచ్చిన హామీలను అమలు చేయమంటే దేవుళ్ల మీద ఒట్టు లు వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నాడని ఆరోపించారు. దేశ సంపదను మోడీ అంబానీ(ambani),ఆదానీలకు(adani) దోచి పెడుతున్నాడని ఆరోపించారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయమంటే దేవుళ్ళ మీద ఒట్లు వేస్తూ తిరుగుతున్నారని ఆరోపిం చారు. రైతుబంధును అందించ డంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ నాయకులు బాండ్ రాసిచ్చి మాట తప్పారని అన్నారు. మహిళ లకు నెలకు 2500 రూపాయలు చెల్లిస్తానన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతి మహిళకు 10 వేల రూపా యల బాకీ పడ్డదన్నారు. వడ్లకు మద్దతు ధర, రైతుబంధు 15 వేలు ఇస్తానన్న హామీలు అమలు కావడం లేదన్నారు. ప్రజలు మరో సారి కాంగ్రెస్ మాయ మాటలకు మోస పోవద్దని పార్లమెంట్ ఎన్నికలలో విజ్ఞతతో ఓటు వేసి నల్లగొండ ఎంపీ గా కంచర్ల కృష్ణా రెడ్డిని గెలిపించాలని కోరారు.

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కోమటి రెడ్డి బ్రదర్స్, కుందూరు జానారెడ్డి లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనను మర్చి ఈ రెండు కుటుంబాలు పదవుల కోసం ఆశపడుతూ కుటుంబ పాలన చేస్తున్నాయని ఆరోపించారు. కోమటి రెడ్డి(Komati reddy) కుటుంబంలో ఇద్దరికి పదవులు ఉండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో రెండు పదవులు ఉన్నా యని, జానా రెడ్డి కుటుంబంలో ఓ కొడుకు ఎమ్మెల్యేగా ఉండగా మరో కొడుకుకు ఎంపీ టిక్కెట్ ఇప్పించు కున్నాడని ఇది కుటుంబ పాలన కాకమరేంటని ప్రశ్నించారు. సాగర్ నియోజవర్గాన్ని తాను మంత్రిగా ఉన్న సమయంలోనే అభివృద్ధి చేశానని జానా రెడ్డి సాగర్ అభివృ ద్ధికి ఏనాడు పని చేయలేదని ఆరోపించారు. నల్లగొండ ఎంపీ సీటును బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్,మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,మాజీ ఎమ్మెల్యే కంచర్ల పాల్గొన్నారు.

Congress and BJP fail promises in nalgonda