Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KCR Chennuru Road Show: రద్దoటే రణరంగమే

గిరి జనుల కోసం, ప్రజల కోసం, మారు మూల ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన మాట చెప్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.

జిల్లాల రద్దు అన్న ప్రచారంతో ప్రజల్లో గందరగోళం
కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేయడమే మీకున్న పనా
మనకున్నది ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడిపై ఒట్టేసే సీఎం
పంటకు బోనస్ లేదు, మద్దతు ధరకు కొనే దిక్కు లేదు
దళితబంధు డబ్బులు వెనక్కి తీసుకున్నారు
చెన్నూరు రోడ్ షోలో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్

ప్రజా దీవెన, హైదరాబాద్: గిరి జనుల కోసం, ప్రజల కోసం, మారు మూల ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన మాట చెప్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)పేర్కొన్నారు. పాత ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలను ఏర్పాటు చేసుకు న్నామని, ఎన్నికల మర్నాడే మంచిర్యాల, నిర్మల్ జిల్లాలను రద్దుచేస్తానని ఈ ముఖ్యమంత్రి అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల కోసం యుద్ధం చేద్దామని, మంచిర్యాల జిల్లాగా ఉండాలంటే ఈ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని కోరారు.

బస్సుయాత్రలో భాగంగా చెన్నూరు(Chennuru)ఐబీ చౌరస్తాలో శనివారం నిర్వహిం చిన రోడ్లో కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల కల అయిన మంచిర్యాల జిల్లాను కేసీఆర్ తెచ్చిందని, దీనిని రద్దుచేస్తే మళ్లీ కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ ఆదిలాబాద్ దారి పట్టాలా? అని ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా కోసం కొట్లాడుదామా? యుద్ధం చేద్దామా? అని ప్రశ్నించారు. మా మంచిర్యాల జిల్లా మాకు ఉండాలంటే బ్యాలెట్ యుద్ధం చేసి ఈశ్వర్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే తెలంగాణ ఆగమైందని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.

తాగు, సాగునీళ్లు, కరెంటుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్(BRS) హయాంలో రెప్పపాటు సమయం కూడా కరెంటు ఇప్పుడెందుకు పోతున్నదని ప్రశ్నించారు. నల్లా నీళ్లు ఎక్కడ మాయమయ్యాయని, సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడికి పోయిందని, కల్యాణలక్ష్మి చెక్కులు ఎక్కడికి పోయాయని నిలదీశారు. రైతుబంధు ఎటుపోయింది? అందుకోసం పెట్టిన నిధులు ఎటుపోయాయని ప్రశ్నించారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పి, అడ్డగోలు హామీలిచ్చి, నోటికి ఏది వస్తే అది చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఏ రోజు ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి గుడిలో ఒట్లు వేస్తున్నాడని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 9 పోయింది, వంద రోజులు పోయాయని, ఇప్పుడు మళ్లీ ఆగస్టు 15 అంటున్నాడని, నమ్మవచ్చునా? అని నిప్పులు చెరిగారు. ‘రుణమాఫీ అయ్యిందా? రైతుబంధు అందరికీ వచ్చిందా? 2500 ప్రతి మహిళకు వచ్చిందా? కల్యాణలక్ష్మి తులం బంగారం వచ్చిందా? అని కేసీఆర్ ప్రశ్నించగా ‘లేదు.. లేదు’ అని రోడ్ షోకు (Road show)హాజరైన ప్రజలు బదులిచ్చారు. ‘కరెంటు పోతున్నదా? కోతలు మొదలయ్యాయా?’ అని ప్రశ్నించగా ‘అవును’ అంటూ బదులిచ్చారు.

ఆరు గ్యారెంటీల(Six guarantees)పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. అటు మంచినీళ్లు రాక, ఇటు సాగునీళ్లు, కరెంటు ఇవ్వక లక్షల ఎకరాల్లో పంటలను ఎండబెట్టారని, కనీసం కష్టపడి పండించిన పంటలను కూడా కొనే దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. వరికి 500 బోనస్ వస్తున్నదా? అని ఎక్కడ అడిగినా లేదనే చెప్తున్నారని, బోనస్ భోగన్ అయ్యిందని, మద్దతు ధర కూడా లేక రైతులు(Farmers) చచ్చిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.సింగరేణిని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగు తున్నది.

ముఖ్యమంత్రి దావోస్, స్విట్జర్లాండ్లో మాట ముచ్చట మాట్లాడి అగ్రిమెంట్ చేసుకున్నడు. తెలంగాణ(Telangana) కొంగుబంగారమైన సింగరేణి పోతే మన బతుకులు ఎలా ఉంటాయో ఆలోచించాలి.బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరు మీద పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడుపంచాయతీలకు డబ్బులు ఇవ్వడం లేదని, మున్సిపాల్టీల్లో ఊడ్చే పరిస్థితి కూడా లేదని, ఎక్కడికక్కడ చెత్త పేరుకుని పోతున్నదని, హరితహారం చెట్లు, పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయని, య- ఎవకుల కోసం పెట్టిన క్రీడా ప్రాంగణాల్లో చెట్లు మొలుస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

బీఆర్ఎస్(BRS) ప్రారంభించిన చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా ఆపేశారని, మంచిర్యాల ప్రజల కోసం వెజ్, నాన్వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పసులు చేపడితే అవి కూడా మొండిగోడలకే పరిమితమయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఎందుకు అపేసిందని నిలదీశారు..బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజలకు ఉపయోగపడే అన్నిరకాల పనులను నిలిపివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కనీసం స్ట్రీట్ లైట్లు పోతే వాటిని రిపేర్ చేసే పరిస్థితి లేదు. సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులు లేవు. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు బంద్ చేశారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు స్కాలర్షిప్లు బంద్ చేశారు.

కొత్త మెడికల్ కాలేజీలకు(Medical College)పర్మిషన్లు తెస్తలేరు. ఐదు నెలలుగా అన్ని రంగాల్లోనూ పనులు నిలిపివేశారు. ఏ ప్రభుత్వం చేసినా ప్రజలకు సంబంధించిన మంచి పనులు ఉంటే కొనసాగిస్తరు. కానీ ఈ మూర్ఖపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాగోగులు పట్టించుకోకుండా జిల్లాలను రద్దు చేస్తాం. కాంప్లెక్స్ల లు, చెన్నూరు లిఫ్ట్, తాగునీళ్ల స్కీంలను ఆపేస్తమని చెప్తున్నది. కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తా అని ముఖ్యమంత్రి అంటున్నడు’ అని నిప్పులు చెరిగారు. తాను గోదావ రిఖనిలో చెప్పిన దాన్నే మళ్లీ చెప్తున్నానని, ఆ రోజు ప్రధాని మోదీ తన మెడమీద కత్తిపెట్టి ఆస్ట్రేలియా బొగ్గు, అదానీ బొగ్గు కొనాలని చెప్పినా తాము కొనలేదని, కానీ ఈ రోజు ఈ ముఖ్యమంత్రి పోయి అదానీని ఆహ్వానించాడని కేసీఆర్ మండిపడ్డారు.

దావోస్లో లో, స్విట్జర్లాండ్లో లో మాట ముచ్చట మాట్లాడి అగ్రిమెంట్ చేసుకున్నారని ఆరోపించారు. సింగరేణిని కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణి పోతే మన బతుకులు ఎలా ఉంటాయో ఆలోచించాలని కోరారు. కొప్పుల ఈశ్వర్ 26 ఏండ్లు సింగరేణి
కార్మి కుడిగా పనిచేశారని, ఆయన గెలిస్తే సింగరేణిని కాపాడతాడని భరోసా ఇచ్చారు.

KCR war on cancellation of districts