Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

RevanthReddy: మోదీని గద్దె దిగడం ఖాయం

లోక్ సభ ఎన్నికల్లో బిజెపి మోదీ గ్యారంటీలు అంటూ ప్రచారాలు చేస్తున్నారని, కాని మోదీ గ్యారంటీకి వారంటీ ఎప్పుడో తీరిపోయిందని, మోదీ గద్దె దిగడం ఖాయమైందని ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

బిజెపి పదేళ్ల పాలనలో భారత్‌ పరిస్థితి అధ్వానం
మోదీ గ్యారంటీ లకు వారంటీ తీరిపోయింది
సచ్చినపామైన బిఆర్‌ఎస్‌ గురిం చి మాట్లాడుకోవడం అనవసరం
హైదరాబాద్ నగరంలో రోడ్‌షోల్లో సీఎం రేవంత్‌ రెడ్డి

ప్రజా దీవెన, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha elections) బిజెపి మోదీ గ్యారంటీలు అంటూ ప్రచారాలు చేస్తున్నారని, కాని మోదీ గ్యారంటీకి వారంటీ ఎప్పుడో తీరిపోయిందని, మోదీ గద్దె దిగడం ఖాయమైందని ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ సమస్య భారత్‌లో ఉందని, 125 దేశాల్లో ఆకలి కేకల లెక్కలు తీస్తే భారత్‌ 111వ స్థానంలో నిలిచి చెడ్డ పేరు తెచ్చుకుందని, పక్కనే ఉన్న పాకిస్థా న్‌, బంగ్లాదేశ్‌ కంటే మన దేశంలోనే ఆకలి ఎక్కువ ఉందని ఎద్దేవా చేశారు. ఇదంతా పదేళ్ల మోదీ హయాంలో జరిగిందని, ఆయన పాలనలో ఉద్యోగాలు రాలేదని, రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని విమర్శించారు. అందుకే ఈసారి మోదీ(Modi) ఓటమి ఖాయమన్నారు.

సోమవారం హైదరాబాద్‌ నగరం లోని పలు ప్రాంతాలలో జరిగిన కాంగ్రెస్‌ రోడ్‌షోలలో(Roadshow)ఆయన ప్రసం గించారు. మోదీ పదేళ్లుగా ప్రధాని గా ఉన్నా కూడా అంబర్‌పేట బ్రిడ్జిని కిషన్‌రెడ్డి ఎందుకు పూర్తి చేయిం చలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌ నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు కాంగ్రెస్‌(Congress) హయాంలోనే జరిగాయని, అంబర్‌పేటలోని బతుకమ్మకుం టను కబ్జాదారులు అక్రమించి అమ్ముకుంటుంటే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు అడ్డుకున్నా రని గుర్తు చేశారు. అంబర్‌పేట నియోజకవర్గంలో బతుకమ్మ పండుగ వేడుకలను బతుకమ్మ కుంటలోనే ఏర్పాటు చేసే బాధ్యత తనదని హామీనిచ్చారు.

బిజెపి నేతలు మెడ మీద వేలాడే కత్తిలాం టోళ్లని, బీజేపీకి(BJP) పడే ప్రతీ ఓటు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దుకు పోటుగా తయారవుతాయని హెచ్చ రించారు. రిజర్వేషన్లు పెంచి పేదల ను డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా చేయాలని తాము చూస్తున్నామని, వాటిని దొంగ దెబ్బతీయాలని మోదీ కుట్ర పన్నుతున్నారని రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. అందుకనే ఈ ఎన్ని కల్లో 400 సీట్లు కావాలని పిలుపుని స్తున్నారని, ఇది గుర్తించిన బీసీ, ఎస్సీ, ఎస్టీలు మోదీని గద్దె దించటా నికి సిద్ధమయ్యారన్నారు. సచ్చిన పాములా తయారైన బిఆర్‌ఎస్ గు రించి మనం మాట్లాడు కునుడే దం డగ ఆని ఇంకా ఎన్ని రోజులు తండ్రీ కొడుకులు అబద్ధాలు చెబుతారo టూ మీ మోసాలకు కాలం చెల్లిం దని, బిఆర్‌ఎస్‌కు గతమే ఉన్నది కానీ భవిష్యత్తు లేదని సీఎం రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు.

పదేళ్లు ప్రజలను ముంచి, రాష్ట్రాన్ని కొల్ల గొట్టి లక్ష కోట్లు దోచుకున్నారన్నారని తాము అధికారంలోకి వచ్చి వంద రోజులు కాలేదని, అప్పుడే దిగిపో అంటున్నారని, అయ్యపేరు, తాత పేరు చెప్పి కుర్చీలో కూసోలే బిడ్డా కొట్లాడుకుంటూ నీలాంటోళ్లను తొక్కుకుంటూ వచ్చిన నువ్వో నీ అయ్యనో దిగమంటే దిగనీకి ఇక్కడ ఎవ్వరూ లేరు అల్లటప్పాగా అం టూ మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఏమీ చేయలేదని అంటున్న కేటీ ఆర్‌(KTR) చీర కట్టుకొని బస్సు ఎక్కాలని టికెట్‌కు పైసలు అడిగితే పథకాలు అమలు కానట్టేనని పునరుద్ఘాటిం చారు.

Modi defeat in Parliament elections