రఘువీర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
పార్లమెంట్ ఎన్నికలలో రఘువీర్ రెడ్డిని(Raghuveer reddy) అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య లు అన్నారు.
మెజార్టీ వచ్చిన గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పార్లమెంట్ ఎన్నికలలో రఘువీర్ రెడ్డిని(Raghuveer reddy) అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య లు అన్నారు. మంగళవారం నల్గొం డ మండలం పెద్ద సూరారం గ్రామం లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 200 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.నూతనంగా పార్టీలో చేరిన వారిని గుమ్ముల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్యలు హస్తం కండు వాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వా నించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వచ్చిన మెజార్టీకి(Majority) మించి ఎంపీ ఎన్నికల్లో(Lok sabha elections) కాంగ్రెస్ కు రావాలన్నారు.
ఈనెల 13న జరిగే ఎంపీ ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటేసి రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని కోరారు. నల్గొండ నియోజ కవర్గంలో ఎక్కువ మెజార్టీ వచ్చిన గ్రామాలను మంత్రి కోమటిరెడ్డి వెంక ట్ రెడ్డి దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొ న్నారు. మెజార్టీ విషయంలో మంత్రి ఇచ్చిన మాటను మనం నిలబెట్టు కోవాలని పార్టీ శ్రేణులకు సూచిం చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరె డ్డి సహకారంతో గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందా మని పేర్కొన్నారు.
గ్రామంలో పాత,కొత్త అనే తేడా లేకుండా కాంగ్రెస్(congress party) పార్టీ కార్యకర్తలంతా కలసికట్టుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో పనిచేయాలని కోరారు. గ్రామంలో ఇతర పార్టీ కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందున పార్లమెంటు ఎన్నికల్లో 90% మెజార్టీ రావాలని, ఆ దిశగా పార్టీ శ్రేణులు పనిచేయా లని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పెండెం రత్నమాల పాండు, గ్రామ శాఖ అధ్యక్షుడు పిల్లి యాదగిరి, ఏడుదొడ్ల వెంకట్రా మ్ రెడ్డి, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Raghuveer reddy win with huge majority