EC: రైతు భరోసాపై ఈసి ఆంక్షలు
రాష్ట్ర రైతాంగానికి రైతుభరోసా పేరిట నిధులను ఖాతాల్లో జమ చేసే ప్రక్రియపై భారత ఎన్నికల సంఘం మంగళవారం ఆంక్షలు విధించింది. ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యాకే నిధులు విడు దల చేయాలని రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
రైతుభరోసా అందాల్సింది 2.86% మందికేనంటున్న గణాంకాలు
రైతులకు 14 నుంచి నగదు బదిలీ చేసే అవకాశం
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి రైతుభరోసా (Rythu Bharosa)పేరిట నిధులను ఖాతాల్లో జమ చేసే ప్రక్రియపై భారత ఎన్నికల సంఘం మంగళవారం ఆంక్షలు విధించింది. ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యాకే నిధులు విడు దల చేయాలని రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఇదిలా ఉండగా ఈసీ ఆదేశాలు బహిర్గత మయ్యె సరికే రైతు భరోసా కింద నగదుబదిలీ దాదాపుగా పూర్తి కావ డం గమనార్హం. రైతుభరోసా (Rythu Bharosa) చెల్లిం పులు మే 9లోపు పూర్తిచేస్తామం టూ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగం గా చెప్పారని, ఆయన వ్యాఖ్యలు మీడియాలో కూడా వచ్చాయని పేర్కొంటూ ఎన్. వేణుకుమార్ అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ రైతు భరోసాకు సంబంధించి గతంలో నిర్దేశించిన షరతులను ఉల్లంఘిం చినట్లు గుర్తించామని పేర్కొంది.
సీఎం రేవంత్ రైతు భరోసా పంపిణీ పై మాట్లాడి ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు స్పష్టమైందని పేర్కొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్రావు బహిరంగంగా మాట్లాడ టంతో ఈ నిధుల పంపిణీకి బ్రేక్ పడిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అధికారిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి 29 నాటికి రాష్ట్రంలో 64,75,319 మంది రైతులకు ఈ పథకం కింద సర్కారు రూ.5,574 కోట్లకు పైగా నగదును బదిలీ చేసింది. ఈ నెల ఆరో తేదీన మళ్లీ ఈ పథకం కింద నగదు బదిలీని పునఃప్రారంభిం చిoది. 3,27,505 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.986.42 కోట్ల నగదు జమ చేసింది.
మంగళ వారం కూడా కొందరు రైతుల బ్యాం కు ఖాతాల్లో నగదు జమ అయ్యిం ది. ఈలోగా ఈసీ(EC) బ్రేక్ వేసింది. మొ త్తంమీద ఇప్పటివరకు 68,02,824 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6,561.19 కోట్లకు పైగా నగదు జమ అయింది. ఇంకా సుమారు 2 లక్షల మంది రైతులకు రైతు భరోసా వేయాల్సి ఉంటుంది. వీరంతా ఎక్కువ విస్తీర్ణంలో భూమిని కలిగి ఉన్న కేటగిరీ రైతులు. వీరికి కూడా రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే నిధులు సర్దుబాటు చేసింది. కానీ, ఈసీ ఆంక్షల నేపథ్యంలో బదిలీ ప్రక్రియ నిలిచిపోయింది. లేకపోతే బుధ వారానికే రైతుభరోసా పంపిణీ పూర్త య్యేదనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. ఈ క్రమంలోనే 14వ తేదీ నుంచి వీరికి రైతుభరోసా నిధులు అందే అవకాశం ఉందని ఆయా వర్గాలు వెల్లడిస్తున్నాయి.
EC restrictions on farmer assurance