Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vote: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వజ్రాయుధం

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వజ్రాయుధం లాంటిదని ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ తెలిపారు.

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి:  ఆర్డీవో సూర్యనారాయణ

ప్రజా దీవెన కోదాడ:  ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వజ్రాయుధం లాంటిదని ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ తెలిపారు. గురువారం పార్లమెంటు ఎన్నికల్లో నేపథ్యంలో కోదాడ పట్టణంలో ఖమ్మం క్రాస్ రోడ్డు నుండి రంగా థియేటర్ చౌరస్తా వరకు అన్ని శాఖల అధికారుల చె పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిష్పక్షపాతంగా ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా వినియోగించుకున్నప్పుడే బంగారు వ్యవస్థను రూపొందించుకోగలమన్నారు. ఎక్కడ ఉన్న ఓటు వేయడం మాత్రం మరవకూడదన్నారు. ర్యాలీలో ఓటు హక్కు జన్మ హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, తహసిల్దార్లు సాయి గౌడ,రవికుమార్ ఆంజనేయులు ధృవకుమార్ ఎంఈఓ సలీం షరీఫ్ అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Vote is diamond weapon to protect democracy