Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komatireddy Venkat reddy: ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు

పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నట్లు జమైత్ ఏ ఉలేమా అధ్యక్షులు మౌలానా ఎహసానుద్దిన్ ఖాస్మి ప్రకటించారు.

మౌలానా ఎహసానుద్దిన్ ఖాస్మి

ప్రజా దీవెన నల్లగొండ టౌన్ : పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నట్లు జమైత్ ఏ ఉలేమా అధ్యక్షులు మౌలానా ఎహసానుద్దిన్ ఖాస్మి ప్రకటించారు.గురువారం రాత్రి దారుల్ఉలూమ్ నల్గొండలో జమైత్ ఉలేమాగువులు, ముస్లిం పెద్దలతో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,(Komatireddy Venkat reddy)నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్(Kunduru raghuveer reddy) రెడ్డిలు సమావేశమయ్యారు.

అనంతరం ముస్లిం మత పెద్దలు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు తీర్మానం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు జమైత్ ఏఉలెమా అధ్యక్షుడు మౌలానా ఎహసానుద్దీన్ ఖాస్మి ప్రకటించారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిలు ముస్లిం మత పెద్దలకు, ముస్లింలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, పిసిసి స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్, యూత్ కాంగ్రెస్ నాయకులు ముజ్జు, మత గురువులు మఫ్తి సిద్దిక్, అహ్మద్, మౌలానా అక్బర్ ఖాన్, మౌలానా యాసిర్, మౌలానా ఆబిద్ అంజుమ్రషాది, మౌలానా జుబేర్, హఫీజ్ అతిక్, హఫీజ్ యూనిస్, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Muslims support congress party