Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

పోలీస్ సిబ్బంది ఓటర్లతో మర్యాదగా ప్రవర్తించాలి

పోలీస్ సిబ్బంది ఓటర్లతో మర్యాదగా ప్రవర్తించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక ఫంక్షన్ హాల్ లో తమిళనాడు హోంగార్డ్స్ కు ,అరుణాచల్ ప్రదేశ్ సాయుధ సిబ్బందికి, సి ఐ ఎస్ ఎఫ్ సిబ్బందికి పార్లమెంట్ ఎన్నికల్లో పాటించవలసిన విధులపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.

సెల్ ఫోన్లను లోపలికి అనుమతించవద్దు, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే
ప్రజా దీవెన, కోదాడ: పోలీస్ సిబ్బంది ఓటర్లతో మర్యాదగా ప్రవర్తించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక ఫంక్షన్ హాల్ లో తమిళనాడు హోంగార్డ్స్ కు ,అరుణాచల్ ప్రదేశ్ సాయుధ సిబ్బందికి, సి ఐ ఎస్ ఎఫ్ సిబ్బందికి పార్లమెంట్ ఎన్నికల్లో పాటించవలసిన విధులపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల రోజు పోలింగ్ బూత్ లో కి సెల్ఫోన్లను అనుమతించవద్దని ఎన్నికల సామాగ్రి కి ఎన్నికల సిబ్బందికి ఓటర్లకు భద్రత కల్పించటం మన కర్తవ్యం తెలిపారు. పోలింగ్ కేంద్రానికి సుమారు 200 మీటర్లు దూరం పాటించాలని ఆంక్షలు పటిష్టంగా అమలు చేయాలని తెలిపారు. హోలీ కేంద్రాల వద్ద సమస్యలు ఏర్పడినట్లయితే పరిష్కరించడానికి అందరి అధికారుల ఫోన్ నెంబర్లు జాబితాను అందుబాటులో ఉండేటట్లు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మేక నాగేశ్వరరావు కోదాడ డి.ఎస్.పి మామిళ్ళ శ్రీధర్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు స్థానిక సీఐలు రాము రజిత రెడ్డి ఎస్ఐలు సెంట్రల్ ఫోర్ సత్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Police personnel behave politely with voters