Elections: కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
నల్గొండ మండలంలో కాంగ్రెస్ పార్టీలోకి వల సలు భారీగా పెరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గత వారం రోజుల నుంచి వివిధ పార్టీలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిరోజు వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ నుంచి చేరిన ముగ్గురు మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్ లు
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ(Nalgonda) మండలంలో కాంగ్రెస్(congress party) పార్టీలోకి వల సలు భారీగా పెరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గత వారం రోజుల నుంచి వివిధ పార్టీలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిరోజు వందలాది మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలువురు ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఉప సర్పంచ్ లు,వార్డు సభ్యులు, కార్యకర్తలు హస్తం కండువాలు కప్పుకున్నారు .
శనివారం రసూల్ పురం, ఖాజీరామారం, కొత్తపల్లి, చందన పల్లి గ్రామాలకు చెందిన బిఆర్ఎస్, బిజెపి, సిపిఎం పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాప్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డి, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య సమక్షంలో పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు.
మండలంలోని రసూల్ పురం గ్రామానికి చెందిన 50 బీఆర్ఎస్(BRS Party) పార్టీ కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి హస్తం కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా చందనపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ సురిగి మనెమ్మ-రమేష్, మాజీ ఉప సర్పంచ్ కోడెల కలమ్మతో పాటు పలువురు వార్డు సభ్యులతో పాటు100 కుటుం బాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితోపాటు కొత్తపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రొమ్ముల నాగయ్య తోపాటు 100 కుటుంబాలు టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అదేవిధంగా ఖాజీరామారం గ్రామానికి చెందిన 120 బీఆర్ఎస్(BRS Party) పార్టీకి చెందిన కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పి టిసి వంగూరి లక్ష్మ య్యలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిం చారు. పలు ఆవాస గ్రామాలకు చెందిన వందలాది మంది బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.ఈ కార్యక్రమంలో రసూల్ పురం గ్రామ మాజీ సర్పంచ్ గుండెబోయిన వెంకన్న యాదవ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎల్క సైదిరెడ్డి, గుండబోయిన శ్రీనివాస్, చిన్న సైదులు గోలి సైదులు, ఖాజీ రామారావు మాజీ సర్పంచ్ షబ్బీర్ బాబా తదితరులు పాల్గొన్నారు.
People joined congress party