Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

తల్లి, భార్య, ముగ్గురు పిల్లలను అతి దారుణంగా చంపి…. ఆత్మహత్య

డ్రగ్స్ కు బానిసగా మారి తన కుటుంబ సభ్యులను హత్య చేసి అనంతరం అతడు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ లోని రాంపూర్ లో జరిగింది.

లక్నో: డ్రగ్స్ కు బానిసగా మారి తన కుటుంబ సభ్యులను హత్య చేసి అనంతరం అతడు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ లోని రాంపూర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మధురలోని పల్హాపూర్ లో అనురాగ్ సింగ్ అనే వ్యక్తి(45) తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. మద్యంతో పాటు డ్రగ్స్ అలవాటు పడి బానిసగా మారాడు. దీంతో ఇంట్లో కుటుంబ సభ్యులతో పలుమార్లు గొడవలు పెట్టుకున్నాడు. దీంతో అతడి డీ అడిక్షన్ సెంటర్ కు పంపించాలని కుటుంబం భావించింది.

దీంతో కుటుంబ సభ్యులకు అతడి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఉన్మాదిలా మారిపోయాడు. తల్లి సావత్రి(65)ని తుపాకీతో కాల్చి చంపిన అనంతరం భార్య ప్రియాంకను(40) సుత్తితో కొట్టి చంపాడు. ముగ్గురు కుమార్తెలు దారుణంగా చంపేశాడు. అనంతరం అనురాగ్ తనకు తాను కాల్చికొని చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్పి చక్రేశ్ మిశ్రా తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Uttar Pradesh Rampur Sitapur