Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Polling boycotted: పోలింగ్‌ బహిష్కరించిన ప్రజలు

తెలం గాణ‌లో ఓవైపు లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతున్న క్రమంలో మరోవైపు కొన్ని గ్రామాల ప్రజలు పోలింగ్ ను బహిష్కరించా రు.

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ‌లో ఓవైపు లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతున్న క్రమంలో మరోవైపు కొన్ని గ్రామాల ప్రజలు పోలింగ్ ను బహిష్కరించా రు. ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు భారీగా పోలింగ్‌ కేంద్రాలకు పోటె త్తారు. అయితే రాష్ట్రంలోని పలు గ్రామాల ప్రజలు సోమవారం జరు గుతున్న పోలింగ్‌ను బహిష్కరించా రు. తమ గ్రామ సమస్యలు పరిష్క రించడం లేదంటూ ఆయా గ్రామా ల ప్రజలు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.

నాగర్ కర్నూలు మండ లంలోని బల్మూర్‌లో మైనింగ్‌కి ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆ క్రమంలోనే పోలింగ్‌ను బహిష్కరించినట్లు తెలిపారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండలం రాయమాదా రంలో గ్రామస్తులు సైతం పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్‌ఎస్పీ కాలువ పై వంతెన నిర్మించలేదని వారు ఈ సందర్భంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలింగ్ బహిష్కరిం చినట్లు పేర్కొన్నారు. ఇక యాద్రాద్రి జిల్లా పోచంపల్లి మండలంలోని కనుముక్కల గ్రామస్తులు ఈ ఎన్ని కలను బహిష్కరించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధాన్యాన్ని కొను గోలు చేయాలంటూ రాజకీయ నాయకులకు విజ్జప్తి చేసినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలను బహిష్కరించినట్లు వారు స్పష్టం చేశారు. అయితే తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇస్తే ఓటు వేసేందుకు తామంతా సిద్దమ ని కనుముక్కల గ్రామస్తులు ఈ సందర్భంగా తెలిపారు.అదే విధం గా నిర్మల్ జిల్లాలోని కడెం మండ లంలోని అల్లంపల్లి గ్రామస్తులు కూడా పోలింగ్‌కు దూరంగా ఉన్నా రు. తమ గ్రామంలో రహదారి సమ స్య ఉందని, దీనిని చాలా కాలంగా ప్రభుత్వం పరిష్కరించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

People boycotted polling