MLA Shiva kumar vs voter: ఓటరు, ఎమ్మెల్యే పరస్పర దాడి
లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అనుకోని సంఘటన జరిగింది. దీంతో పోలింగ్ బూత్ లోని వారు అవాక్కయ్యారు
తెనాలి పోలింగ్ బూత్లో సంఘటన
లైన్ లో రమ్మన్నందుకు ఓటరు చెంప చెల్లుమనిపించిన తెనాలి ఎమ్మెల్యే
అంతే దీటుగా బదులిచ్చినఓటరు
ప్రజా దీవెన, తెనాలి: లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అనుకోని సంఘటన జరిగింది. దీంతో పోలింగ్ బూత్ లోని వారు అవాక్కయ్యారు. తెనాలి పోలింగ్ బూత్లో ఓటు వేసేందుకు వరుసలో రావాలని, మంది మార్బలంతో లోపలికి వెళితే ఎట్లాగంటూ ఆ ఓటరు ప్రశ్నించడ మే తడువుగా వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రెచ్చిపోయి సదర్ ఓటరు చంప చెల్లుమనిపించారు. గుంటూ రు జిల్లా తెనాలి ఐతానగర్లోని మున్సిపల్ హైస్కూల్లోని పోలింగ్ బూత్లో పోలిం గ్ ఆలస్యం కావ డంతో క్యూలో ఉన్న ఓటర్లు విసుగు చెందారు. అదే వరుసలో ఎన్నారై గొట్టిముక్కల సుధాకర్ ఉన్నారు.
వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే అన్నాబ త్తుని శివకుమార్ కుటుంబమే కాకుండా, ఆయన అనుచరులు పదిమందికిపైగా నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళుతుండడంతో సుధా కర్ వారిని వరుసలో రావాలని కోరా రు. దీంతో సుధాకర్కు, ఎమ్మెల్యే అనుచరులకు వాదనలు సాగాయి. ఈలోపే ఎమ్మెల్యే శివకుమార్ వేగం గా అక్కడకు వచ్చి సుధాకర్ చెంప పై కొట్టడం, సుధాకర్ కూడా అంతే వేగంగా ఎమ్మెల్యే చెంపపై కొట్టడం కనురెప్పపాటులో జరిగిపోయాయి.
ఆ వెంటనే శివకుమార్ అనుచ రులు సుధాకర్పై దాడికి దిగారు. కంటిపై, ముఖంపై గాయాలైన సుధాకర్ అక్కడున్న గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. కొద్దిసేపటికి పోలీసులు ఓటువేయించి స్టేషన్కు సుధాకర్ను తీసుకువెళుతుండగా, మరోసారి ఎమ్మెల్యే అనుచరులు దారుణంగా కొట్టారు. ఆ తర్వాత సుధాకర్ను పోలీసులు స్టేషన్కు తరలించారు. మాజీ మంత్రి ఆలపా టి రాజేంద్రప్రసాద్ సుధాకర్ను వైద్యపరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది. ఇద్దరి పైనా కేసులు నమోదుచేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.
MLA Shiva kumar attack on voter