Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Strong Room: స్ట్రాంగ్ రూమ్ లో వద్ద పటిష్ట బందోబస్తు

తెలం గాణ వ్యాప్తంగా స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ(Telangana) వ్యాప్తంగా స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలు మోహరించారు. ఆయా స్ట్రాంగ్‌ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్(Counting)కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద రౌండ్ ది క్లాక్ సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అలాగే స్ట్రాంగ్‌ రూముల(Strong rooms)వద్ద 144 సెక్షన్‌ అమలు లో ఉంది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ పోలింగ్(Lok Sabha polling) ప్రక్రియ ముగి సింది. నిన్న ఉదయం 7 గంటల పోలింగ్ మొదలవగా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. కొన్ని చోట్ల సరైన సమయానికే పోలింగ్ ముగియగామరికొన్ని పోలింగ్(Polling) బూత్‌ల వద్ద మాత్రం రాత్రి 11 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. 6 గంటల లోపు క్యూలో నిల్చున్న ఓటర్లకు నిర్ణీత సమయం ముగిసిన తర్వాత కూడా కూడా ఓటు(Vote) వేసే అవకాశం కల్పించారు. దీంతో పలు ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 64.74శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

security arrangement strong room