Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kavitha liquor case: కవితక్కకు మళ్ళీ కష్టాలే

దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్కకు మళ్లీ కష్టాలు మొదల య్యాయి.

లిక్కర్ కేసులో జుడీషియల్ కస్టడీ మే 20 వ తేదీ వరకు పొడిగింపు

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టిఆర్ఎస్(TRS) ఎమ్మెల్సీ కవితక్కకు(Kavitha) మళ్లీ కష్టాలు మొదల య్యాయి. లిక్కర్ కేసులో బెయిల్ ఆశించిన బీఆర్ఎల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. మంగళవారంతో జుడీషియల్ కస్టడీ ముగిసినప్పటికీ మే 20 వ తేదీ వరకు పొడగిస్తూ ఢిల్లీలోని సీబీఐ(CBI) ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవె న్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు మంగళవారం కీలక విచార ణ జరిగింది. కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ పొడగించాలని కోర్టు(Court)ను ఈడీ కోరింది. 8 వేల పేజీలతో సప్లి మెంటరీ చార్జిషీట్ దాఖలు చేశా మని ఈడీ తెలిపింది. దీంతో జుడీషియల్ కస్టడీని పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జి షీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై మే 20 న విచారణ జరుపుతామని రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది.

Kavitha judicial extended till May 20