Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MP Laxman: ఆగస్టు సంక్షోభంలో ప్రభుత్వం

అన్నమాట ప్రకారంపంద్రాగస్టులోగా రైతులకు రుణమాఫీ చేయకపోతే రేవంత్‌ ప్రభుత్వం సంక్షోభం ఎదు ర్కోక తప్పదని బీజేపీ ఓబీసీ మో ర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్‌ హెచ్చరించారు.

అత్యుత్సాహంతో అడ్డగోలు గ్యారెంటీలు
అమలు చేయకపోతే ప్రజలే కాదు సొంత పార్టీ నేతలూతిరగబడతారు

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్‌

ప్రజా దీవెన, హైదరాబాద్: అన్నమాట ప్రకారంపంద్రాగస్టులోగా రైతులకు రుణమాఫీ చేయకపోతే రేవంత్‌ ప్రభుత్వం సంక్షోభం ఎదు ర్కోక తప్పదని బీజేపీ(BJP) ఓబీసీ మో ర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్‌ (MP Laxman) హెచ్చరించారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీలో బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు.గ్యారెం టీలు, ఉచితాలపై రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రజల్లో భ్రమలు కల్పిం చారని. వాటిని అమలు చేయక పోతే ప్రజలే కాదుగదా సొంత పార్టీ నాయకులు కూడా తిరగబడతారని స్పష్టం చేశారు. మంగళవారం బీజే పీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియా తో మాట్లాడారు.

అప్పు చేస్తేగానీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉందని తెలిసినా అత్యుత్సాహంతో అడ్డగోలు హామీ లు, గ్యారెంటీలు ఇచ్చారని లక్ష్మణ్ విమర్శించారు. సోమవారం నాటి పోలింగ్ను పరి శీలిస్తే, బీజేపీ అన్ని స్థానాల్లో గెలిచే పరిస్థితి కనిపిస్తోంద న్నారు. తెలంగాణలో(Telangana) బీజేపీ 12 ఎంపీ సీట్లు కైవసం చేసు కోవడం పక్కా అని పార్టీ జాతీయ కార్యవ ర్గసభ్యులు, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దీమా వ్యక్తం చేశారు.

సర్వే సంస్థలు కూడా ఊహించని విధంగా జూన్ 4న అద్భుతం జరగ బోతోందని అన్నారు. ఈటల మీడియాతో మాట్లాడారు. పదేళ్ల కిందట కాంగ్రెస్(Congress) ఎలాంటి నీచ మైన మాటలు చెప్పిందో. సీఎం రేవంత్ అవే మాటలు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. పోలింగ్ తర్వాత సీఎం, కాంగ్రెస్ నేతల మాటల్లో మార్పు కనిపిం చిందన్నారు. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ఏలేటి ధీమా వ్యక్తం చేశారు.

telanagana govt crisis in august