Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KTR: అక్కడ కుస్తీ.. ఇక్కడ దోస్తీ

తెలం గాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసిపో యాయని, ఆ రెండు పార్టీల వ్యవ హారం ఢిల్లీలో కుస్తీ. గల్లీలో దోస్తీ అన్నట్లుగా ఉందని బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిం చారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అలాయి బలాయి
బీజేపీ గెలుపునకు విశ్రమించకుం డా శ్రమించిన రేవంత్
ఆరేడు లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు
దేశంలో ఏ కూటమికీ మెజారిటీ రాదు, ప్రాంతీయ పార్టీలే కీలకం
మీడియా సమావేశంలో బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో(Telangana) కాంగ్రెస్, బీజేపీ కలిసిపో యాయని, ఆ రెండు పార్టీల వ్యవ హారం ఢిల్లీలో కుస్తీ. గల్లీలో దోస్తీ అన్నట్లుగా ఉందని బీఆర్ఎస్(BRS) వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిం చారు. రాష్ట్రంలో ఆరేడు పార్లమెం టు స్థానాల్లో కాంగ్రెస్ బలహీనమైన, డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన జీవన్డ్డి కరీంనగర్ లో పోటీ చేయాలనుకుంటే ఆయనను బలవంతంగా నిజామాబాద్ లో పోటీ చేయించారని తెలిపారు.

కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా ప్రజలకు తెలియదని ఎద్దేవా చేశారు. ఇక సికింద్రాబాద్ అభ్యర్థి చివరి పది రోజుల్లో ప్రచారం కూడా చేయలేదని, మల్కాజిగిరి అభ్యర్థి ఆ ప్రాంతానికి సుపరిచి తు లు కాదని పేర్కొన్నారు. సీఎం రేవం త్ రెడ్డి(CM Revanth Reddy) కాంగ్రెస్ తరఫున డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపిం చడానికి కిషన్రెడ్డి కంటే ఎక్కువ కష్ట పడ్డారని అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేటీఆర్(KTR) విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూట ముల్లో దేనికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థి తుల్లేవని, ప్రాంతీయ పార్టీలదే హవా అని పేర్కొన్నారు.

ఏ కూటమిలోనూ లేని బీఆర్ఎస్, వైసీపీ, బిజూ జనతాదళ్ వంటి ప్రాంతీయ శక్తులు నిర్ణ యాత్మక పాత్ర పోషించబోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 17 సీట్లలోనూ బీఆర్ఎస్ గట్టీ పోటీ ఇచ్చిందని, రెండు నెలల కాలంలోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గులాబీ సైనికులు ముచ్చెమ టలు పట్టించారని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిందని, రెండు జాతీయ పార్టీల నాయకులు తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితిని కల్పించిందని పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించబో తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్(Congress) పార్టీ వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను తుంగలో తొక్కడంతో ఆ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించిందన్నారు. ఐదు నెలలుగా ప్రభుత్వాన్ని కాంగ్రెస్.. టైంపాస్ గా నడిపిందని ఆరోపించారు. ఇక బీజేపీ తరపున గత ఎన్నికల్లో నలుగురిని ఎంపీలుగా గెలిపించినా.. వారితో ఒరిగిందేమీ లేదనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. కాగా, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో కేటీఆర్ బుధవారం తెలంగాణ భవన్ లో భేటీకానున్నారు.

congress friendship with BJP