KCR: రైతాంగ వ్యతిరేక చర్యలకు బిఆర్ఎస్ నిరసనలు
రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసి న రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్(kcr) పిలు పునిచ్చారు.
రాష్ట్రవ్యాప్త నిరసనలకు గులాబి అధినేత కేసీఆర్ పిలుపు
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసి న రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్(kcr) పిలు పునిచ్చారు.పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్(bonus) చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రేస్(congress) ప్రభుత్వం ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచనకు గురిచేయడమేనని కేసీఆర్ దుయ్యబట్టారు. రాష్ట్ర కాంగ్రేస్ ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలను ఈ సందర్భంగా అధి నేత కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.
బుధవారం ఆయనొక పత్రికా ప్రక టన విడుదల చేస్తూ రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని తెలిసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా ఎలా ప్రకటిస్తారని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకు మాత్రమే బోన స్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రేస్ ప్రభుత్వం మరో సారి వంచించిందన్నారు. ఓట్లు డబ్బాలో పడగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిపోయిందన్న ట్లు సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూను కున్నారని ద్వజమెత్తారు. ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నిక లకు ముందు గనుక చెప్పింటే కాంగ్రె స్ పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసేవాళ్లని అన్నారు. ఇప్పటికీ ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారని, రైతు బంధు ఇయ్యక, రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్ని రకాలుగా కాంగ్రేస్ పార్టీ మోసం చేస్తున్నదని ఆరోపించారు.
అందు కారణంగానే రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకే బిఆర్ ఎస్ పార్టీ (BRS Party)రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టిందని కేసీఆర్ స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని పిలు పునిచ్చారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్ల క్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పుచ్చు కుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించేదిశగా నిరసన కార్యక్ర మాలతో పాటు ప్రతిరోజూ వడ్ల కల్లాలకాడికి బిఆర్ఎస్ శ్రేణులు పోవాలని, రైతులకు అండగా నిల వాలని బీఆర్ఎస్అధినేత పిలు పు నిచ్చారు. రైతుల హక్కులను కాపా డేందుకు వారికి అండగా నిలి చేం దుకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అధినేత కేసీఆర్ పునరుద్ఘటించారు.
BRS protests against anti-farmer activities